www.ntodaynews.com
అఖిలాంధ్ర దివ్యాంగుల జిల్లా సదస్సు
తెలంగాణ
అఖిలాంధ్ర దివ్యాంగుల జిల్లా సదస్సు
NTODAY NEWS: ఏలూరు జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ కళ్యాణ్ కుమార్
ఏలూరులో అఖిలాంధ్ర దివ్యాంగుల సేవాసమితి – మానవసేవే మాధవసేవ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి లీడర్స్ మీటింగ్ నిర్వహించారు.
ఈ సమావేశంలో దివ్యాంగుల సమస్యల పరిష్కారం, సేవా కార్యక్రమాల విస్తరణపై విస్తృతంగా చర్చించారు.
ఈ మీటింగ్ యొక్క ప్రధాన ఉద్దేశ్యం దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించడం, ముఖ్యంగా బెడ్రిడ్ పేషెంట్లను గుర్తించి సంఘం తరఫున వారికి సేవలు అందించేందుకు నాయకులు చొరవ చూపాలని నిర్ణయించారు. అలాగే వివిధ నియోజకవర్గాల్లో మండల, గ్రామ స్థాయి కమిటీలను ఏర్పాటు చేసి సేవలను మరింత విస్తృతం చేయాలని పిలుపునిచ్చారు.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రతి దివ్యాంగుడిని గుర్తించి, వారికి అవసరమైన సహాయాన్ని అందిస్తూ “మానవసేవే మాధవసేవ” అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నాయకులు సూచించారు.
ఈ కార్యక్రమంలో
అధ్యక్షుడు మామిడిపల్లి నాగభూషణం, గౌరవ అధ్యక్షుడు సూరెడ్డి శ్రీనివాసరావు, సలహాదారు వద్దండు అప్పారావు, సెక్రటరీ నక్క రాము, కోశాధికారి అలిపిరి దుర్గాప్రసాద్, జాయింట్ సెక్రటరీ బుర్ర సుధాకరమ్మ, మహిళా కార్యదర్శులు సునీత, జ్యోతి శ్రీ, కార్యదర్శి అవినాష్, కార్యవర్గ సభ్యులు ఈశ్వరయ్య, అమ్మిరాజు, వెంకటేశ్వరరావు, రాగుల సుధా తదితరులు పాల్గొన్నారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube