అమెరికాలో తెలుగు మూలాల దంపతుల దాతృత్వం
అంతర్జాతీయం
అంతర్జాతీయం
అమెరికాలో తెలుగు మూలాల దంపతుల దాతృత్వం ఇప్పుడు వార్తల్లో నిలిచింది. యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్కు అనురాధ–వికాస్ సిన్హా దంపతులు ఏకంగా 20 మిలియన్ డాలర్లు.. అంటే దాదాపు ₹190 కోట్లు విరాళంగా అందించారు. ఈ భారీ విరాళానికి గుర్తుగా యూనివర్సిటీలోని ఏఐ కాలేజీకి వారి పేరు పెట్టారు. ఆసక్తికరంగా వికాస్ సిన్హా హైదరాబాద్ ఉప్పల్ కేంద్రీయ విద్యాలయం, తిరుపతి శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీలో చదువుకున్నారు. చదువుకున్న నేల నుంచి అమెరికా యూనివర్సిటీకి ఇంత భారీ స్థాయిలో తిరిగి ఇవ్వడం నిజంగా స్ఫూర్తిదాయకం.