BREAKING
పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు
www.ntodaynews.com

అమృత్ 2.0, డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల పనుల్లో వేగం పెంచాలి-జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

తెలంగాణ
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
18 Jun, 2026 - 07:05 PM
160 వీక్షణలు

​బెల్లంపల్లి మండల కేంద్రంలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనులను మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పరిశీలించారు. ఆయన వెంట బెల్లంపల్లి తహసీల్దార్ కృష్ణ, మున్సిపల్ కమిషనర్ రమేష్, మున్సిపల్ చైర్ పర్సన్ దావ స్వాతి తదితర అధికారులు ఉన్నారు. పట్టణ ప్రజలకు నిరంతరం త్రాగునీటిని అందించే లక్ష్యంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'అమృత్ 2.0' పథకంలో భాగంగా నిర్మిస్తున్న నీటి ట్యాంకులు, పైపులైన్ల పనులను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూనే నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసి ప్రజలకు త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

​అలాగే మున్సిపల్ పరిధిలో పారిశుధ్య నిర్వహణను పకడ్బందీగా చేపట్టాలని, ప్రతిరోజూ ఇంటింటికీ తిరిగి తడి, పొడి చెత్తను విడివిడిగా సేకరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. పట్టణ అవసరాల దృష్ట్యా నూతన డంపింగ్ యార్డ్ ఏర్పాటు కొరకు ఆయన అధికారులతో కలిసి పలు స్థలాలను పరిశీలించారు. అనంతరం, నిరుపేదల కోసం ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్‌రూమ్ (రెండు పడక గదుల) ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించి అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. ఇండ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచి, నిర్ణీత గడువులోగా పూర్తి చేసి పేదలకు అందించే దిశగా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్, రెవెన్యూ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు