www.ntodaynews.com
అంగన్వాడీ కేంద్రంలో ఆరోగ్య లక్ష్మి కమిటీ సమావేశం
తెలంగాణ
/
నల్గొండ
/
చిట్యాల
/
చిట్యాల
అంగన్వాడీ కేంద్రంలో ఆరోగ్య లక్ష్మి కమిటీ సమావేశం
నల్గొండ జిల్లా చిట్యాల మండల పరిధిలో వెంబావి గ్రామంలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో శనివారం ఆరోగ్య లక్ష్మి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గ్రామ సర్పంచ్ గుండెబోయిన అలివేలు వెంకన్న హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గర్భిణులు బాలింతలకు పౌష్టికాహారం పై పలు సూచనలు ఆమె చేశారు. ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న పౌష్టికాహారాన్ని ప్రతి గర్భిణీ , బాలింత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పోషకాహార లోపం తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అప్పుడే ఆరోగ్యవంతమైన సమాజం సాధ్యమవుతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో గుణగంటి బిక్షపతి గౌడ్, ఆశా వర్కర్ లక్మి, అంగన్వాడీ టీచర్ సునీత, మరియు గ్రామస్తులు పాల్గొన్నారు...