అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు
వైశ్య భవన్ లో ఘనంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం
కార్యక్రమాన్ని నిర్వహించిన ఓం అష్టోత్తర యోగ పీఠ్ స్వామి వివేకానంద యోగా ట్రస్ట్
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని వైశ్య భవన్ లో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఓం అష్టోత్తర యోగ పీఠ్ స్వామి వివేకానంద యోగా ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు గారు మాట్లాడుతూ... మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి యోగా ఎంతో దోహదపడుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగాను ఒక భాగంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడిని దూరం చేసుకునేందుకు యోగా ఒక అద్భుతమైన మార్గమని కొనియాడారు. ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన స్వామి వివేకానంద యోగా ట్రస్ట్ నిర్వాహకులను ఆయన అభినందించారు.
ఈ కార్యక్రమంలో యోగా ట్రస్ట్ నిర్వాహకులు, యోగా గురువులు, పలువురు ప్రముఖులు, వైశ్య సంఘం ప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో యోగా సాధకులు పాల్గొని వివిధ రకాల ఆసనాలను ప్రదర్శించారు