బొమ్మలరామారం మండలంలో పూర్వ విద్యార్థుల సిల్వర్ జూబ్లీ ఆత్మీయ సమ్మేళనం
యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మలరామారం మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2000-2001 లో పదో తరగతి పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థులు 25 ఏళ్ల తర్వాత పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో కలుసుకున్నారు. తమకు విద్య నేర్పిన గురువులకు ప్రత్యేకంగా ఆహ్వానించి సత్కరించారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి సర్వేపల్లి రాధాకృష్ణ, సరస్వతి మాత చిత్ర పటాలకు పూజలు నిర్వహించారు.అనంతరం విద్యార్థులు ఒకరినొకరు తమ జీవిత అనుభవాలు పాఠశాల స్థాయి నాటి జ్ఞాపకాలను వేదిక నుంచి పంచుకున్నారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు మాట్లాడారు...తమ పిల్లలకు సంస్కృతి సంప్రదాయాలను నేర్పించాలన్నారు. ఎన్ని అవరోధాలు వచ్చినా చదువు విషయంలో ఎవరు కూడా వెనకడుగు వేయవద్దన్నారు. చదివే అన్నింటికీ మూలాధారమని పేర్కొన్నారు.గురువులకి తమ శిష్యులు ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడే గురువు కు అసలైన విలువ ఇచ్చినట్టు అని అభివర్ణించారు. తమ విద్యార్థులు అన్ని రంగాల్లో ఉన్నత స్థాయిలో ఉండడం గర్వించదగ్గ విషయం అన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు హనుమంత్ రెడ్డి, దశరథ ,అంజయ్య, రాజయ్య, శేఖర్, శ్యాం పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.