www.ntodaynews.com
పుంగనూరులో అమానుష ఘటన
తెలంగాణ
పుంగనూరులో అమానుష ఘటన
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన గోమాంసం వ్యవహారం NTODAY NEWS: అన్నమయ్య జిల్లా, పుంగనూరు రిపోర్టర్ పుంగనూరులోని రెడ్డి డాబా (ఫ్రెండ్స్ డాబా)లో గోమాంసం వంటలు తయారు చేస్తున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గురువారం రాత్రి ఈ డాబాలో జరిగిన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఘటన వివరాలు: డాబాలో చికెన్ వంటకం ఆర్డర్ చేసిన ఓ కస్టమర్కు పొరపాటున గిన్నె మారిపోయి గోమాంసం వడ్డించడంతో అసలు విషయం బయటపడింది. అనుమానం వచ్చిన కస్టమర్లు పక్క టేబుల్ను పరిశీలించగా, పెద్ద ఎముకలతో కూడిన గోమాంసం తింటున్న వ్యక్తులు కనిపించారు.
నిర్వాహకుడి అంగీకారం:
కస్టమర్లు నిర్వాహకుడిని నిలదీయగా, పొరపాటు జరిగిందని చెప్పడంతో పాటు, గోమాంసం వంట చేస్తే రూ.200 బిల్లు వసూలు చేస్తున్నామని, గతంలో కూడా పలుమార్లు ఇలానే వండినట్లు నిర్వాహకుడు అంగీకరించినట్లు సమాచారం.
ఈ విషయం బయటపడిన వెంటనే నిర్వాహకుడు డాబాకు తాళం వేసి మూసివేసినట్లు తెలిసింది.
హిందూ సంఘాల ఆగ్రహం:
ఈ ఘటనపై హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
“ఇది పూర్తిగా ఫుడ్ సేఫ్టీ అధికారుల నిర్లక్ష్యమే. పుంగనూరులో విచ్చలవిడిగా గోమాంసం వండుతున్న హోటళ్లు, డాబాలను అధికారులు పట్టించుకోవడం లేదు” అంటూ మండిపడ్డారు.
#Punganur
#FoodSafety
#DhabaIssue
#PublicOutrage
#FoodInspection
#AndhraPradeshNews
#BreakingNews
Follow us on
Website
Facebook
Instagram
YouTube 