ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అపూర్వ స్పందన.
భారీగా హాజరైన ప్రజలు, 600 అర్జీలు సమర్పణ.
పాల్గొన్న జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు, జిల్లా అధికారులు.
రెవెన్యూ సంభందిత సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ.
NTODAY NEWS: ఎన్టీఆర్ జిల్లా
ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం 3 డిసెంబర్ (ఎన్ టుడే న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి) ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అపూర్వ స్పందన లభించింది. ఎప్పటినుంచో పెండింగులో ఉన్న రెవిన్యూ సంబంధిత ప్రజా సమస్యలతో పాటు ఇతరత్రా సమస్యల సత్వర పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా మైలవరం పట్టణంలోని ఎస్వీ కళ్యాణ మండపంలో మంగళవారం మధ్యాహ్నం ప్రజాదర్బారు కార్యక్రమం అని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ తో పాటు, జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, జిల్లా జాయింట్ కలెక్టర్ ఇలక్కియా, ఎన్టీఆర్ జిల్లాలోని వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.ముందుగా వందేమాతరం ఆలపించారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు.ప్రజాదర్బారు నిర్వహణను ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మైలవరం నియోజకవర్గంలో గతంలో వివిధ చోట్ల మండల కేంద్రాల్లో ప్రజాదర్బారు నిర్వహించారు. ఆయా సందర్భాలలో రెవెన్యూ సమస్యలు, సర్వేకు సంభందించిన భూ సమస్యలు తెలిపారు. వీటికి సంబంధించి సత్వరమే శాశ్వత పరిష్కారం కోసం మైలవరంలో మంగళవారం ప్రజాదర్బారు నిర్వహించారు.మండలాల్లో అధికారులు బాధ్యతగా పని చేయాలి. సందర్భంగా జిల్లా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ జిల్లా అధికారులు అందరూ నియోజకవర్గాని విచ్చేసి గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మండలంలోని అధికారులు కూడా సమస్యలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యతతో వ్యవహరించాలన్నారు. సమస్యలను పరిష్కారం చేయాలని కాకుంటే ఎందుకు పరిష్కరించలేక పోతున్నామో అర్జీ దారునికి వివరించాలన్నారు. ఏమైనా కోర్టు కేసులు వున్నాయా? వివాదాలు వున్నాయా? మరేమైనా కారణాలు ఉంటే వారికి తెలపాలని అన్నారు. అర్జీ దారుల సమయాన్ని వృధా చేయకూడదన్నారు. పి.జి.ఆర్.ఎస్ వస్తున్న ఫిర్యాదులపై ఖచ్చితంగా పనిచేస్తే ప్రజల్లో ప్రభుత్వంపై, పని చేసే అధికారులపై, ముఖ్యంగా గవరెన్స్ పై నమ్మకం కలుగుతుందన్నారు.నిర్ణీత కాలవ్యవధిలో సమస్యల పరిష్కారం చేయాలన్నారు. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ ప్రజాస్వామ్య పాలనకు ప్రజాదర్బారు దర్పణం పడుతుందన్నారు. జవాబుదారీతనంతో ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నట్లు వెల్లడించారు. ఇక్కడ ఆర్జీలు సమర్పించే ప్రతి సమస్య పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సెల్ సిస్టం (పి.జి.ఆర్.ఎస్)లో నమోదు చేసి ఆయా శాఖలకు పంపుతామని పేర్కొన్నారు. నిర్ణీత కాలవ్యవధిలో ఆయా సమస్యలు పరిష్కరించనున్నట్లు వెల్లడించారు. ప్రతివారం ప్రజాదర్బారు.జిల్లా అధికారులు కూడా అందుబాటులో ఉండటంతో వారి పరిధిలోని దీర్ఘకాలిక సమస్యలు కూడా వెంటనే పరిష్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే రెడ్డిగూడెం, జి.కొండూరు, మైలవరంలో ప్రజాదర్బారు నిర్వహించామని, ఇకపై క్రమం తప్పకుండా ప్రతివారంలో ఒక రోజు ప్రజాదర్బారు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ అధికార యంత్రాంగం కూడా ప్రతి అర్జీదారునితో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ గారికి, జెసి గారికి, జిల్లా అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.600 ఆర్జీలు సమర్పణ.మైలవరం నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాల నుంచి 600 మంది ఆర్జీలు సమర్పించారు. ఇందులో ప్రధానంగా రెవెన్యూకు సంబంధించిన దీర్ఘకాలిక సమస్యలు, ఇళ్లస్థలాలు, దివ్యంగుల ధ్రువీకరణ పత్రాలు, కొండపల్లి మున్సిపాలిటీలో ప్రధాన రహదారి విస్తరణపై అఖిలపక్షం ఆధ్వర్యంలో, సంక్షేమ పథకాల వర్తింపు తదితర సమస్యలపై అర్జీలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ), తదితరులు పాల్గొన్నారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube