www.ntodaynews.com
సిపిఐ నేత కె. నారాయణ దంపతుల అరుదైన నిర్ణయం
జాతీయం
వృద్ధుల సంక్షేమానికి తమ జీవితాంతం సంపాదించిన ఆస్తిని పూర్తిగా విరాళంగా ఇవ్వనున్నట్లు సిపిఐ నేత కె.నారాయణ దంపతులు నిర్ణయం తీసుకున్నారు. వృద్ధాశ్రమాల నిర్వహణ, వృద్ధుల సంరక్షణ కార్యక్రమాల కోసం ఈ ఆస్తిని వినియోగించాలన్న సంకల్పాన్ని ప్రకటించారు.
సమాజ సేవే ప్రధాన లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. నిరాడంబర జీవనశైలికి మరోసారి నిదర్శనంగా ఈ చర్య నిలుస్తోందని రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చ జరుగుతోంది. సంపాదించినదంతా సమాజానికే అంకితం చేయాలన్న భావనతో ముందుకు వచ్చారని తెలుస్తోంది.
ఈ నిర్ణయం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నేటి రాజకీయాల్లో అరుదైన ఉదాహరణగా నెటిజన్లు అభివర్ణిస్తూ ప్రశంసలు వ్యక్తం చేస్తున్నారు. వృద్ధుల జీవితాల్లో భద్రత, ఆశ కలిగించే చర్యగా ఈ విరాళాన్ని చూస్తున్నారు.