BREAKING
మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు
www.ntodaynews.com

అన్న క్యాంటీన్లకు ఏటా రూ.50లక్షల విరాళం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
19 Apr, 2026 - 11:01 AM
26 వీక్షణలు

అన్న క్యాంటీన్లకు ఏటా రూ.50లక్షల విరాళం

నారా భువనేశ్వరి సంచలన నిర్ణయం


ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు జన్మదినోత్సవం ఈనెల 20న జరగనుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబునాయుడు సతీమణి, ఎన్టీఆర్ మోమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రోజూ లక్షలాదిమంది పేదల ఆకలిని తీరుస్తున్న అన్న క్యాంటీన్లకు ఏటా 50 లక్షల రూపాయల విరాళం అందచేయాలని నిర్ణయించారు. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అన్న క్యాంటీన్లకు భారీగా విరాళాలు అందుతున్నాయి.అన్న క్యాంటీన్లకు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు తరుపున ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ప్రభుత్వానికి ఇంతకుముందే కోటి రూపాయల విరాళం అందచేశారు. అన్న క్యాంటీన్లలో సీఎం చంద్రబాబుతో కలిసి స్వయంగా ఆమె భోజనాలు వడ్డిస్తుంటారు. దీనికి తోడు చంద్రబాబు జన్మదినోత్సవం వేళ ఏటా 50లక్షల విరాళం ప్రకటించి తన ఉదారతను చాటుకున్నారు. పేదల కడుపు నింపేందుకు ప్రభుత్వం అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయడం గొప్ప కార్యక్రమమని ఆమె కొనియాడారు. ఎన్టీఆర్‌ స్ఫూర్తితో మహత్తర కార్యక్రమానికి మద్దతుగా నిలవాలన్న ఉద్దేశంతో విరాళం అందించామన్నారు. ఇటీవల తన మనవడు నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా తిరుమలలో అన్న ప్రసాదానికి  44 లక్షల రూపాయల విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే.నారా  దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం ఈ విరాళం అందిస్తూ, చంద్రబాబు కుటుంబం స్వయంగా అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు అన్నదానం చేయడం ఆనవాయితీగా వస్తోంది.