BREAKING
ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి
www.ntodaynews.com

అన్నారంలో వైభవంగా గంగమ్మ తల్లి వార్షికోత్సవం..

తెలంగాణ
/ నిజామాబాద్ / ఆర్మూర్
Reporter
Ramu jaju డొంకేశ్వర్ మండల ప్రతినిధి
01 May, 2026 - 09:07 PM
65 వీక్షణలు

గంగపుత్రుల ఆధ్వర్యంలో ఘనంగా బోనాల ఉత్సవం..

డొంకేశ్వర్ (అన్నారం): నిజామాబాద్ జిల్లా డొంకేశ్వర్ మండలంలోని అన్నారం గ్రామంలో శ్రీ గంగమ్మ తల్లి ఆలయ మొదటి వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం అత్యంత వైభవంగా జరిగాయి. గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉత్సవాల్లో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.ఈ సందర్భంగా గంగపుత్ర సంఘం మహిళలు అందంగా అలంకరించిన బోనాలను నెత్తిన ఎత్తుకుని, డప్పు చప్పుళ్లు, శివసత్తుల నృత్యాల నడుమ ఊరేగింపుగా బయలుదేరారు. చేపల వలలు, బెలూన్లతో అలంకరించిన ప్రత్యేక పందిరితో ఊరేగింపుగా చెరువు గట్టున ఉన్న గంగమ్మ తల్లి ఆలయానికి చేరుకున్నారు. మహిళలు ఆలయం చుట్టూ ఐదు మార్లు ప్రదక్షిణలు చేసి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పించారు. గ్రామస్తులంతా చల్లగా ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని భక్తులు ఆ తల్లిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో గంగపుత్ర సంఘం నాయకులు, గ్రామ పెద్దలు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.