BREAKING
మేడే స్పూర్తి ఉరకలు… కార్మిక హక్కుల కోసం గళమెత్తిన విస్సన్నపేట ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మిక హక్కుల కోసం గళమెత్తిన ఏఐసిసిటియు తడిసిన ధాన్యాన్ని తరుగు లేకుండా కొనాలి మరణంలోనూ బిడ్డను వదలని తల్లి ప్రేమ బాలికల భవిష్యత్తుకు బలమైన అడుగు కష్టాల కడలిలో ఈదుతూ రాష్ట్రంలోనే రెండో ర్యాంక్ సాధించిన పవిత్ర అన్నారంలో వైభవంగా గంగమ్మ తల్లి వార్షికోత్సవం.. ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం – ఆరుగురు దుర్మరణం మే 9న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాధవరం రాక జాతీయ సమైక్యతకు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కీలకం మేడే స్పూర్తి ఉరకలు… కార్మిక హక్కుల కోసం గళమెత్తిన విస్సన్నపేట ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మిక హక్కుల కోసం గళమెత్తిన ఏఐసిసిటియు తడిసిన ధాన్యాన్ని తరుగు లేకుండా కొనాలి మరణంలోనూ బిడ్డను వదలని తల్లి ప్రేమ బాలికల భవిష్యత్తుకు బలమైన అడుగు కష్టాల కడలిలో ఈదుతూ రాష్ట్రంలోనే రెండో ర్యాంక్ సాధించిన పవిత్ర అన్నారంలో వైభవంగా గంగమ్మ తల్లి వార్షికోత్సవం.. ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం – ఆరుగురు దుర్మరణం మే 9న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాధవరం రాక జాతీయ సమైక్యతకు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కీలకం
www.ntodaynews.com

అన్నారంలో వైభవంగా గంగమ్మ తల్లి వార్షికోత్సవం..

తెలంగాణ
/ నిజామాబాద్ / ఆర్మూర్
Reporter
Ramu jaju డొంకేశ్వర్ మండల ప్రతినిధి
01 May, 2026 - 09:07 PM
12 వీక్షణలు

గంగపుత్రుల ఆధ్వర్యంలో ఘనంగా బోనాల ఉత్సవం..

డొంకేశ్వర్ (అన్నారం): నిజామాబాద్ జిల్లా డొంకేశ్వర్ మండలంలోని అన్నారం గ్రామంలో శ్రీ గంగమ్మ తల్లి ఆలయ మొదటి వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం అత్యంత వైభవంగా జరిగాయి. గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉత్సవాల్లో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.ఈ సందర్భంగా గంగపుత్ర సంఘం మహిళలు అందంగా అలంకరించిన బోనాలను నెత్తిన ఎత్తుకుని, డప్పు చప్పుళ్లు, శివసత్తుల నృత్యాల నడుమ ఊరేగింపుగా బయలుదేరారు. చేపల వలలు, బెలూన్లతో అలంకరించిన ప్రత్యేక పందిరితో ఊరేగింపుగా చెరువు గట్టున ఉన్న గంగమ్మ తల్లి ఆలయానికి చేరుకున్నారు. మహిళలు ఆలయం చుట్టూ ఐదు మార్లు ప్రదక్షిణలు చేసి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పించారు. గ్రామస్తులంతా చల్లగా ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని భక్తులు ఆ తల్లిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో గంగపుత్ర సంఘం నాయకులు, గ్రామ పెద్దలు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.