BREAKING
జూన్ 12న పాఠశాలలలో విద్యార్థులతో ప్రతిజ్ఞ పోలవరం గ్రామంలో వీధి కుక్కల బెడదపై చర్యలు తీసుకోవాలి అంబేద్కర్ విగ్రహానికి 46వ వారం జ్ఙానమాల కార్యక్రమం.. అనంతపురంలో ఏసీబీ వలలో మున్సిపల్ అధికారులు 22-A భూ సమస్యల పరిష్కారం!… రైతులకు, ప్రజలకు ఊరట! చెక్కపల్లిలో భూదాన భూములను గుర్తించి పేదలకు పంచాలి ఏలూరు జిల్లాలో అక్రమ PDS మాఫియా కలకలం కన్నుల పండుగగా శ్రీ మహాలింగేశ్వర స్వామి కళ్యాణం రైతుల పక్షాన పోరాడుతా.. మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి చిన్నకాపర్తిలో ఉపాధి కూలీలకు ఆరోగ్య కిట్ల పంపిణీ జూన్ 12న పాఠశాలలలో విద్యార్థులతో ప్రతిజ్ఞ పోలవరం గ్రామంలో వీధి కుక్కల బెడదపై చర్యలు తీసుకోవాలి అంబేద్కర్ విగ్రహానికి 46వ వారం జ్ఙానమాల కార్యక్రమం.. అనంతపురంలో ఏసీబీ వలలో మున్సిపల్ అధికారులు 22-A భూ సమస్యల పరిష్కారం!… రైతులకు, ప్రజలకు ఊరట! చెక్కపల్లిలో భూదాన భూములను గుర్తించి పేదలకు పంచాలి ఏలూరు జిల్లాలో అక్రమ PDS మాఫియా కలకలం కన్నుల పండుగగా శ్రీ మహాలింగేశ్వర స్వామి కళ్యాణం రైతుల పక్షాన పోరాడుతా.. మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి చిన్నకాపర్తిలో ఉపాధి కూలీలకు ఆరోగ్య కిట్ల పంపిణీ
www.ntodaynews.com

అన్నారంలో వైభవంగా గంగమ్మ తల్లి వార్షికోత్సవం..

తెలంగాణ
/ నిజామాబాద్ / ఆర్మూర్
Reporter
Ramu jaju డొంకేశ్వర్ మండల ప్రతినిధి
01 May, 2026 - 09:07 PM
19 వీక్షణలు

గంగపుత్రుల ఆధ్వర్యంలో ఘనంగా బోనాల ఉత్సవం..

డొంకేశ్వర్ (అన్నారం): నిజామాబాద్ జిల్లా డొంకేశ్వర్ మండలంలోని అన్నారం గ్రామంలో శ్రీ గంగమ్మ తల్లి ఆలయ మొదటి వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం అత్యంత వైభవంగా జరిగాయి. గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉత్సవాల్లో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.ఈ సందర్భంగా గంగపుత్ర సంఘం మహిళలు అందంగా అలంకరించిన బోనాలను నెత్తిన ఎత్తుకుని, డప్పు చప్పుళ్లు, శివసత్తుల నృత్యాల నడుమ ఊరేగింపుగా బయలుదేరారు. చేపల వలలు, బెలూన్లతో అలంకరించిన ప్రత్యేక పందిరితో ఊరేగింపుగా చెరువు గట్టున ఉన్న గంగమ్మ తల్లి ఆలయానికి చేరుకున్నారు. మహిళలు ఆలయం చుట్టూ ఐదు మార్లు ప్రదక్షిణలు చేసి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పించారు. గ్రామస్తులంతా చల్లగా ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని భక్తులు ఆ తల్లిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో గంగపుత్ర సంఘం నాయకులు, గ్రామ పెద్దలు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.