www.ntodaynews.com
కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం రక
తెలంగాణ
కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాక
NTODAY NEWS: గొల్లపల్లి మండలం జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దర్శించుకోనున్న నేపథ్యంలో ఆయన పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ పర్యటనలో భాగంగా కొండగట్టు ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నిధుల నుంచి కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధి కోసం రూ.35.19 కోట్లను మంజూరు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఉప ముఖ్యమంత్రి పర్యటన షెడ్యూల్ ఇలా ఉంది:
ఉదయం 09:00 గంటలకు హైదరాబాద్ మాదాపూర్లోని తన నివాసం నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరుతారు.
ఉదయం 09:25 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు.
ఉదయం 09:30 గంటలకు బేగంపేట నుంచి హెలికాప్టర్ ద్వారా కొండగట్టు (JNTU హెలిప్యాడ్)కు బయలుదేరుతారు.
ఉదయం 10:20 గంటలకు కొండగట్టు JNTU హెలిప్యాడ్కు చేరుకుంటారు.
ఉదయం 10:30 గంటలకు రోడ్డు మార్గంలో కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయానికి చేరుకుంటారు.
ఉదయం 10:30 నుండి 10:50 గంటల వరకు శ్రీ ఆంజనేయ స్వామి వారి దర్శనం.
ఉదయం 10:55 నుండి 11:30 గంటల వరకు TTD మంజూరు చేసిన ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమం.
ఉదయం 11:40 గంటలకు కొడిమ్యాల గ్రామంలోని బృందావన్ రిసార్ట్స్కు చేరుకుంటారు.
మధ్యాహ్నం 12:00 గంటలకు బృందావన్ రిసార్ట్స్లో ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొంటారు.
మధ్యాహ్నం 01:10 గంటలకు కొండగట్టు హెలిప్యాడ్ నుంచి హెలికాప్టర్ ద్వారా బేగంపేటకు తిరుగు ప్రయాణం.
మధ్యాహ్నం 02:00 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు.
మధ్యాహ్నం 02:30 గంటలకు మాదాపూర్లోని తన నివాసానికి రోడ్డు మార్గంలో చేరుకుంటారు.
ఈ పర్యటనకు సంబంధించిన సమాచారం డైరెక్టర్, డైరెక్టరేట్ ఆఫ్ ప్రోటోకాల్, ఏపీ స్టేట్ గెస్ట్ హౌస్, విజయవాడ మరియు. అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఇంటెలిజెన్స్), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, విజయవాడ వారి ద్వారా ప్రభుత్వ మెయిల్ సందేశం నం. 247/పోల్.ఎ/ఎ1/2025, తేదీ 29.12.2025 ప్రకారం విడుదలైంది.
కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు భక్తుల్లో ఆనందాన్ని కలిగిస్తున్నాయి.
Follow us on
Website
Facebook
Instagram
YouTube