షాద్ నగర్ కాంగ్రెస్ పార్టీ క్రిస్టియన్ మైనార్టీ కో ఆర్డినేటర్ గా రవితేజ చైతన్య కుమార్...
NTODAY NEWS: షాద్ నగర్ రిపోర్టర్ శ్రీహరి
నియామక పత్రం అందజేసిన షాద్ నగర్ ఎమ్మెల్యే విర్లపల్లి శంకర్......
షాద్ నగర్ పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు రవితేజ (చిన్న) కాంగ్రెస్ పార్టీ క్రిస్టియన్ మైనార్టీ షాద్ నగర్ నియోజక వర్గం కో ఆర్డినేటర్ గా నియమితులయ్యారు. ఈ సందర్భంగా షాద్ నగర్ ఎమ్మెల్యే విర్ల పల్లి శంకర్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నాకు పదవి వచ్చేందుకు కృషి చేసిన షాద్ నగర్ ఎమ్మెల్యే విర్ల పల్లి శంకర్, కాంగ్రెస్ పార్టీ క్రిస్టియన్ మైనార్టీ చైర్మెన్ దీపక్ జాన్ కు రవితేజ (చిన్న) కృతజ్ఞతలు తెలిపారు. క్రిస్టియన్ మైనారిటీ అభివృదకి తనవంతు కృషి చేస్తాను అని రవితేజ తెలియచేసారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ ఖాన్, కాంగ్రెస్ పార్టీ నేతలు చల్ల శ్రీకాంత్ రెడ్డి, గుండత్రి బాలరాజు గౌడ్, ఇబ్రహీం, కమ్మదనం నవీన్ కుమార్, జాంగారి రవి మహబూబ్, లయక్ బాయ్, తదితరులు పాల్గొన్నారు..
Follow us on
Website
Facebook
Instagram
YouTube