www.ntodaynews.com
శ్రీ సత్యసాయి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా
తెలంగాణ
శ్రీ సత్యసాయి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా KS షానవాజ్ నియామకం
NTODAY NEWS: కదిరి నియోజకవర్గం రిపోర్టర్ వినోద్ కుమార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతంలో భాగంగా రాష్ట్రానికి సంబంధించి 25 జిల్లాల డీసీసీ అధ్యక్షులను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించారు.
ఈ నేపథ్యంలో శ్రీ సత్యసాయి జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా కదిరి నియోజకవర్గ ఇన్చార్జ్ KS షానవాజ్ను నియమించారు. డీసీసీ అధ్యక్షుడిగా నియమించినందుకు పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి, సీడబ్ల్యూసీ సభ్యుడు రఘువీర రెడ్డిలకు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సందర్భంగా KS షానవాజ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. ఈ నియామకంపై జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube