అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా టిట్కో అపార్ట్మెంట్స్
అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా టిట్కో అపార్ట్మెంట్స్ చర్యలు తీసుకోవాలని సిఐ సుబ్బరాయుడు మరియు మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డికి ఫిర్యాదు చేసిన నేష
పుంగనూరు పరిధిలోని గూడూరుపల్లి దగ్గర వున్న టిడ్కో అపార్ట్మెంట్స్ లో ఉంటున్న వారు ఈరోజు వారు ఇబ్బంది పడుతున్న సమస్యల గురించి ఈరోజు మునిసిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి కి, అలాగే పుంగనూరు సిఐ సుబ్బరాయుడు గారికి వినతి పత్రాన్ని అందజేశారు.
ముఖ్యంగా ఈ టి డి కో ఇలలో అసాంఘిక కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతున్నాయని, చీకటి పడితే బహిరంగ ప్రదేశాల్లో మందు తాగటం గొడవలు పడటం ఆడవారితో అసభ్యంగా ప్రవర్తించడం చేస్తున్నారని అపార్ట్మెంట్ వాసులు వాపోయారు. అలాగే వీధిలైట్లు కొరత ఎక్కువగా ఉండటం వల్ల పాములు ఎక్కువగా సంచరిస్తున్నాయని అదే విధంగా కుక్కల బెడద ఎక్కువగా ఉందని నీటి సమస్య కూడా ఉన్నదని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. అలాగే అక్కడ ఉన్న యువత గంజాయికి బానిసలు అవుతున్నారని రాత్రి వేళల్లో వాహనాలలో అధిక శబ్దం చేస్తూ ఇబ్బంది పెడుతున్నారని కూడా తెలిపారు కొంతమంది ఏకంగా అపార్ట్మెంట్స్ లో ఇళ్లను బాడుగకు తీసుకొని వ్యభిచారం చేపిస్తున్నారని వీటి మీద వీలైనంత తొందరగా చర్యలు తీసుకోవాలని పోలీసు వారు గస్తీ పెంచాలని పై సమస్యలను పరిష్కరించాలని అపార్ట్మెంట్ వాసులు కోరుతున్న
ఈ కార్యక్రమలో టిడ్కో అపార్ట్మెంట్ వాసులు కృష్ణమాచారి, బాదుల్ల, అఖిల్ రాజా, వజీర్, అన్సర్, అయేషా, పద్మ, భాను, తదితరులు పాల్గొన్నారు