బాలికల జూనియర్ కళాశాలలో అవగాహన కార్యక్రమం
NTODAY NEWS: పుంగనూరు రిపోర్టర్ రాఘవేంద్ర రాజు
బుధవారం పుంగనూరులోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సీఐ సుబ్బరాయుడు విద్యార్థినులకు డిజిటల్ మోసాలు, సైబర్ క్రైమ్స్, పోక్సో చట్టం, మైనర్ పిల్లలు వాహనాలు నడిపితే ఎదురయ్యే శిక్షలు తదితర అంశాలపై వివరంగా అవగాహన కల్పించారు. విద్యార్థులు ఈ రకమైన నేరాలకు దూరంగా ఉండాలని సూచించారు.
అదేవిధంగా, అదే రోజు కళాశాలలో మరో కార్యక్రమంగా అపోలో మెడికల్ కాలేజ్, చిత్తూరు ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపును నిర్వహించారు. ఈ సందర్భంగా హార్ట్ స్ట్రోక్ వచ్చిన వ్యక్తులకు ఐదు దశల్లో సీపీఆర్ నిర్వహించడం ద్వారా ప్రాణాలు కాపాడవచ్చని ప్రొఫెసర్ లీలావతి విద్యార్థులకు ప్రాయోగికంగా అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ గల్లా గంగాధర్ నాయుడు, అధ్యాపకులు రాధాకృష్ణ, అపోలో మెడికల్ కాలేజ్ లెక్చరర్ కార్తీక్, శ్రీశక్తి కానిస్టేబుల్ ముని చంద్ర నాయక్, ఆయన సిబ్బంది, కళాశాల అధ్యాపక–అధ్యాపకేతర బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube