బాధిత కుటుంబానికి కౌన్సిలర్ సుధాకర్ భరోసా
బాధిత కుటుంబానికి కౌన్సిలర్ సుధాకర్ భరోసా
నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఒకటో వార్డు శివనేనిగూడెంలో విశాఖ నల్గొండ గ్రామానికి చెందిన అమరోజి శివ (29) అనే యువకుడు అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. చేతికి అందిన కొడుకు అకాల మరణం చెందడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు శోక సంద్రంలో మునిగిపోయారు. యువకుడి మరణ వార్త విన్న వార్డు కౌన్సిలర్ నాగిళ్ళ సుధాకర్ (కావేరి) మృతుడి నివాసానికి చేరుకొని శివ భౌతిక గాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యులను వారు ఓదార్చి ధైర్యం చెప్పారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చి కౌన్సిలర్ సుధాకర్ అలియాస్ కావేరి తక్షణ సహాయంగా 5000 రూపాయలు అందించారు. మృతుని కి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు వారికి ఎటువంటి ఆపద రాకుండా భవిష్యత్తులో తన వంతు సహాయం అందిస్తానని తెలియజేశారు. ప్రభుత్వ సహాయం చిన్న వయసులోనే ఇంటి పెద్దదిక్కు కోల్పోయిన ఆ కుటుంబానికి ప్రస్తుతం దిక్కుసూచన స్థితిలో ఉందని ప్రభుత్వం స్పందించి చిన్నపిల్లలున్న ఆ కుటుంబానికి ఆర్థిక సాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.