బాలికలు ఉన్నత లక్ష్యాలతో ఎదగాలి
బాలికలు ఉన్నత లక్ష్యాలతో ఎదగాలి : సర్పంచ్ కాటం వెంకటేశం NTODAY NEWS చిట్యాల
నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామ పంచాయతీ ఆవరణలో కిశోర బాలికల సంఘాల అవగాహన సదస్సు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సర్పంచ్ కాటం వెంకటేశం బాలికల భవిష్యత్తు, ఆరోగ్యం మరియు సామాజిక బాధ్యతలపై ఆయన మాట్లాడుతూ 14 నుండి 18 ఏళ్ల వయస్సు గల బాలికలు చదువుతో పాటు నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవాలని, తల్లిదండ్రులు వారిని ప్రోత్సహించాలని కోరారు. పిల్లల సెల్ఫోన్ వాడకంపై తల్లిదండ్రులు నిరంతరం నిఘా ఉంచాలని, వారితో స్నేహపూర్వకంగా ఉంటూ మనోధైర్యాన్ని నింపాలని సూచించారు. బాల్య వివాహాల నివారణ: 18 ఏళ్లు నిండిన తర్వాతే బాలికలకు వివాహం చేయాలని, అప్పుడే వారు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఓర్సు సైదులు, కురు యాదయ్య, ఆనగంటి నరేష్, వీఓఏ అధ్యక్షురాలు శ్రీలత, ఆశా వర్కర్ గుండెబోయిన మమత, మోర అందాలు, కిశోర బాలికలు మరియు వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.