www.ntodaynews.com
బాల్య మిత్రునికి కుటుంబానికి ఆర్థిక సహాయం
తెలంగాణ
/
నల్గొండ
/
చిట్యాల
బాల్య మిత్రునికి కుటుంబానికి ఆర్థిక సహాయం
నల్గొండ జిల్లా చిట్యాల పట్టణానికి చెందిన మును గోటి వెంకన్న ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. సోమవారం అతని తోపాటు ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుకున్న 2006-07 పూర్వ విద్యార్థులు ఒక లక్ష 23 వేల రూపాయలను పోస్ట్ ఆఫీస్ లో మృతుడు వెంకన్న కూతురు రేణుక పేరు మీద ప్రధానమంత్రి సుకన్య యోజన పథకం కింద డిపాజిట్ చేసి వెంకన్న కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో గుండాల నరేష్, దమ్మాల నరేందర్ రెడ్డి, చిన్నపాక నాగరాజు, జిట్ట శేఖర్, కూరాకుల యాదగిరి పాల్గొన్నారు