BREAKING
ఒక రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదం బీర్ల ఐలయ్యపై అనుచిత వ్యాఖ్యలు జిల్లా ప్రజలకు వాతావరణ హెచ్చరిక ఏలూరు-జంగారెడ్డిగూడెం ప్రధాన రహదారి నిర్మాణపు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి పునర్విభజన - మహిళా రిజర్వేషన్ బిల్లుపై సిపిఐ ఎంఎల్ లిబరేషన్ విమర్శలు శంఖంపల్లి గ్రామంలో విషాదం.. విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి జలధార పనులు నాణ్యతతో పూర్తి చేయాలి: కలెక్టర్ ​మంచిర్యాలలో బీజేపీ పార్టీ బలోపేతమే లక్ష్యంగా దిశానిర్దేశం కస్తూరిబా పాఠశాలను పరిశీలించిన కలెక్టర్ మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశం ఒక రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదం బీర్ల ఐలయ్యపై అనుచిత వ్యాఖ్యలు జిల్లా ప్రజలకు వాతావరణ హెచ్చరిక ఏలూరు-జంగారెడ్డిగూడెం ప్రధాన రహదారి నిర్మాణపు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి పునర్విభజన - మహిళా రిజర్వేషన్ బిల్లుపై సిపిఐ ఎంఎల్ లిబరేషన్ విమర్శలు శంఖంపల్లి గ్రామంలో విషాదం.. విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి జలధార పనులు నాణ్యతతో పూర్తి చేయాలి: కలెక్టర్ ​మంచిర్యాలలో బీజేపీ పార్టీ బలోపేతమే లక్ష్యంగా దిశానిర్దేశం కస్తూరిబా పాఠశాలను పరిశీలించిన కలెక్టర్ మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశం
www.ntodaynews.com

బైకానీ నరసింహ మృతి: గ్రామంలో విషాదం, కుటుంబానికి ఆర్థిక సహాయం

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / రామన్నపేట
Reporter
సిర మహేష్ రామన్నపేట మండల ప్రతినిధి
28 Mar, 2026 - 02:03 PM
79 వీక్షణలు

రామన్నపేట మండలం పల్లివాడ గ్రామంలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో సీపీఎం పార్టీ నాయకుడు బై కానీ నరసింహ మృతి చెందడం తీవ్ర విషాదాన్ని కలిగించింది. ఈ ఘటన గ్రామ ప్రజలను, పార్టీ కార్యకర్తలను తీవ్రంగా కలచివేసింది.

ఈ విషాద వార్తను తెలుసుకున్న గ్రామ సర్పంచ్ కంభంపాటి శ్రీనివాసులు గౌడ్, నరసింహ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా నరసింహ సీపీఎం పార్టీకి చేసిన సేవలను ఆయన గుర్తు చేసుకున్నారు. పార్టీ పట్ల నిబద్ధతతో పనిచేసే మంచి నాయకుడిని కోల్పోవడం ఎంతో బాధాకరమని పేర్కొన్నారు.

అనంతరం టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో, పార్టీ కార్యకర్తల సహకారంతో నరసింహ కుటుంబానికి రూ.37,000 ఆర్థిక సహాయం అందజేశారు. భవిష్యత్తులో కూడా వారి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. నరసింహ ఎక్కడ ఉన్నా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

ఈ కార్యక్రమంలో నాంపల్లి లింగయ్య (మాజీ ఉపసర్పంచ్), దండిగ నాగరాజు, కంకణాల శేఖర్ రెడ్డి, గడ్డం యాదగిరి, నాంపల్లి నరసింహ, బెజ్జంకి శంకరాచారి, మేకల లింగయ్య, కల్లూరి శ్రీనివాస్, తోటకూరి దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు.

గ్రామంలో మంచి వ్యక్తిగా పేరు పొందిన నరసింహ మరణం స్థానికంగా తీవ్ర శోకాన్ని మిగిల్చింది.