బడిబాట కార్యక్రమంలో వెల్లంకి ఉపాధ్యాయులు
బడిబాట కార్యక్రమంలో వెల్లంకి ఉపాధ్యాయులు
రామన్నపేట మండలం ప్రాథమిక పాఠశాల వెల్లంకి ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమాన్ని గుడ్ ఫ్రైడే సెలవు అయినప్పటికీ కూడా విద్యార్థులతో కలిసి నిర్వహించడం జరిగింది. ముందుగా బడిబాట కార్యక్రమం యొక్క కరపత్రమును గ్రామ సర్పంచ్ శ్రీమతి ఇడెం రాధా శ్రీనివాస్ మరియు కరపత్ర దాతలు బత్తుల శ్రీనివాస్ ,AAPC చైర్ పర్సన్ శ్రీమతి పులగం సులోచన, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ పల్లె మోహన్ రెడ్డి గారలు సంయుక్తంగా ఆవిష్కరించడం జరిగింది. తదుపరి బడిబాట కార్యక్రమం లో భాగంగా గ్రామంలో ప్రతి ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ పాఠశాలలో వారి పిల్లలను చేర్పించాలని కోరడం జరిగింది. వారి నుండి మంచి స్పందన రావడం జరిగింది. వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ శ్రీమతి ఈడెం రాధా శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విలువైన ఉచిత విద్య లభిస్తుందని తెలియజేయడం జరిగింది అదేవిధంగా ప్రతి తల్లిదండ్రులు ఆలోచించి మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి పాఠశాల బలోపేతానికి సహకరించాలని కోరడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు శ్రీ ఇట్టే సోమిరెడ్డి , ఉయ్యాల బిక్షమయ్య, దూదిగామ సువర్ణ, మందుగుల వెంకటయ్య, కొసన మాధవి, నకిరేకంటే అశ్విని పాల్గొనడం జరిగింది.