వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన భువనగిరి శాసనసభ్యులు
బీబీనగర్ మండల కేంద్రం లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి.
బీబీనగర్ మండలంలోని చిన్నారావులపల్లి , బ్రాహ్మణపల్లి, రాఘవాపూర్ ,గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి గింజకు సరైన ధర లభించేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా కొనుగోలు కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించామని పేర్కొన్నారు.ధాన్యం తేమ శాతం,తూకం విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు.రైతులు మధ్యవర్తులపై ఆధారపడకుండా నేరుగా కొనుగోలు కేంద్రాలకు తమ ధాన్యాన్ని తీసుకురావాలని కోరారు.ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తోందని,వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు ,యూత్ కాంగ్రెస్ నాయకులు ,అధికారులు,రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.