www.ntodaynews.com
బీజేపీ బీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గాజుల ముఖేష్ గౌడ్
తెలంగాణ
/
మంచిర్యాల
/
మంచిర్యాల
మంచిర్యాల: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ ఫ్లోర్ లీడర్ గాజుల ముఖేష్ గౌడ్ బీజేపీ బీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ నియామకంపై మంచిర్యాల నియోజకవర్గ బీజేపీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర స్థాయిలో ముఖేష్ గౌడ్ కు కీలక పదవి లభించడంతో ఈ ప్రాంతంలో పార్టీ కార్యకలాపాలు మరింత వేగవంతం అవుతాయని శ్రేణులు భావిస్తున్నాయి. ఈ సందర్భంగా ముఖేష్ గౌడ్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ, బీసీల సంక్షేమం మరియు పార్టీ బలోపేతం కోసం అంకితభావంతో పనిచేస్తానని స్పష్టం చేశారు.