బీజేపీ కంచుకోటను బద్దలు కొట్టిన ప్రశాంత్ కిషోర్.. బంకీపూర్లో చరిత్రాత్మక విజయం
బీజేపీ కంచుకోటను బద్దలు కొట్టిన ప్రశాంత్ కిషోర్.. బంకీపూర్లో చరిత్రాత్మక విజయం
బీజేపీకి అజేయ కోటగా పేరొందిన బిహార్లోని బంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయ సంచలనం నమోదైంది. ఎన్నికల వ్యూహకర్తగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ ఈ ఉపఎన్నికలో ఘన విజయం సాధించి కమలం పార్టీకి ఊహించని షాక్ ఇచ్చారు.
జన్ సురాజ్ అభ్యర్థిగా బరిలో దిగిన ప్రశాంత్ కిషోర్ తన సమీప ప్రత్యర్థి నీరజ్పై స్పష్టమైన ఆధిక్యంతో గెలుపొందారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రాతినిధ్యం వహించిన ఈ స్థానానికి ఆయన రాజ్యసభకు ఎన్నిక కావడంతో ఉపఎన్నిక జరిగింది.
గత 30 ఏళ్లుగా బీజేపీ వరుస విజయాలు నమోదు చేస్తూ అజేయంగా నిలిచిన బంకీపూర్లో కమలం పార్టీ విజయపరంపరకు ప్రశాంత్ కిషోర్ బ్రేక్ వేశారు. దీంతో బిహార్ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేచింది. ఎన్నికల వ్యూహకర్తగా ఇతర పార్టీలను విజయతీరాలకు చేర్చిన ప్రశాంత్ కిషోర్, ఇప్పుడు తన సొంత పార్టీతోనే ప్రజా తీర్పు సాధించి తన రాజకీయ సత్తాను చాటుకున్నారు.
ఈ విజయం జన్ సురాజ్ పార్టీకి భారీ ఊపునిచ్చే అవకాశముందని, రానున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ సమీకరణాలను మార్చే పరిణామంగా మారొచ్చని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.