BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

బీసీ గ్యారంటీలను అమలు చేయాలి

తెలంగాణ
/ తెలంగాణ
18 Mar, 2026 - 09:54 AM
121 వీక్షణలు

బీసీ గ్యారంటీలను అమలు చేయాలి: మంచిర్యాలలో ‘లక్ష సంతకాల సేకరణ’ ప్రారంభం

మంచిర్యాల: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన బీసీ సంక్షేమ హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ‘లక్ష సంతకాల సేకరణ’ ఉద్యమం ప్రారంభమైంది. బుధవారం మంచిర్యాల కార్పొరేషన్ ముల్కల అంబేద్కర్ విగ్రహం వద్ద సమితి నేతలు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తున్నా బీసీ సబ్ ప్లాన్, సివిల్ పనుల్లో 42% రిజర్వేషన్లు, రూ. 10 లక్షల విద్యా రుణం వంటి కీలక హామీలను విస్మరించిందని మండిపడ్డారు. బీసీల ఓట్ల కోసమే మేనిఫెస్టోలో ఈ అంశాలను చేర్చారని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు గుమ్ముల శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు గజ్జెల్లి వెంకటయ్య, శాఖపూరి భీమ్సేన్, వేముల అశోక్, కీర్తి రవి, రామగిరి రాజన్న చారి, ధర్మాజీ సాయి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు