www.ntodaynews.com
బెంగాల్లో టీఎంసీ నేత ఇంట్లో బంగారు బెడ్, సోఫా..?
జాతీయం
పశ్చిమ బెంగాల్లో ఎన్నికల ఫలితాల అనంతరం జరిగిన బాంబు పేలుడు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఎంసీ నేత షమీమ్ అహ్మద్ ఇంటిపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా 4 అంతస్తుల భవనంలోని ఓ రహస్య ఫ్లాట్లో బంగారంతో తయారు చేసినట్లు కనిపిస్తున్న బెడ్, సోఫా తదితర విలాసవంతమైన వస్తువులు బయటపడినట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్ అవుతోంది. “చిన్న స్థాయి నేత ఇంట్లోనే ఇంత వైభవం ఉంటే ఎమ్మెల్యేలు, మంత్రుల ఇళ్ల పరిస్థితి ఎలా ఉంటుందో?” అంటూ నెటిజన్లు వ్యాఖ్యలు చేస్తున్నారు.