BREAKING
చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు పేపర్ ప్లేట్ల వాడకంని నిషేధించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు పేపర్ ప్లేట్ల వాడకంని నిషేధించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్.
www.ntodaynews.com

బిఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
18 Jun, 2026 - 02:54 PM
227 వీక్షణలు

తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యల పరిష్కారం, ఉద్యోగాల నోటిఫికేషన్ల విడుదలను డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వీ (BRSV) చేపట్టిన ముఖ్యమంత్రి నివాస ముట్టడి కార్యక్రమం నేపథ్యంలో పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా అప్రమత్తమయ్యారు.

ముట్టడి కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు పలుచోట్ల ముందస్తు అరెస్టులు చేపడుతున్నారు. ఇందులో భాగంగా నల్గొండ జిల్లా చిట్యాల పట్టణంలో పలువురు బీఆర్ఎస్ నాయకులను గురువారం ముందస్తుగా అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

అరెస్టయిన వారిలో Agu Ashok, Maragoni Ramesh, Nazeemuddin, Kurella Lingaswamy, పదో వార్డు కౌన్సిలర్ Nimmanagoti Srinivas, Avula Anand, Boluguri Saidulu తదితరులు ఉన్నారు.

నిరుద్యోగులకు న్యాయం చేయాలని, ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని బీఆర్ఎస్వీ డిమాండ్ చేస్తోంది. మరోవైపు, శాంతిభద్రతల దృష్ట్యా ముందస్తు చర్యలు చేపట్టినట్లు పోలీసులు పేర్కొంటున్నారు.

ఈ పరిణామంతో చిట్యాల పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, పోలీస్ బందోబస్తును మరింత కట్టుదిట్టం చేశారు.