BREAKING
జనగనణ ప్రారంభం - భూమా అఖిలప్రియరెడ్డి MLA ఆళ్లగడ్డ ​గూడెం గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి.. ​మంచిర్యాల పట్టణంలో చలివేంద్రాలను ప్రారంభించిన శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు ఏలూరు మెయిన్ రోడ్డు రహదారి నిర్మాణపు పనులు వేగవంతం చేయాలి.... ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి నియామకం నంద్యాల జిల్లా, ఆత్మకూరు మున్సిపాలిటీ నూతన మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి మేఘన ఎస్టేట్ బాధితుల తరపున కేంద్ర మంత్రి బండి సంజయ్ గారికి వినతి పత్రం అందజేత. పోలవరంలో మృతుని కుటుంబానికి పదివేల రూపాయలు అందజేత చాట్రాయిలో గౌతు లచ్చన్న వర్ధంతి సందర్భంగా ఘన నివాళి మూడు నెలల రేషన్ పంపిణీ.. క్యూలైన్‌లో గంటల తరబడి తిప్పలు... కరెంటు కోత.. ఉక్కపోత.. జనగనణ ప్రారంభం - భూమా అఖిలప్రియరెడ్డి MLA ఆళ్లగడ్డ ​గూడెం గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి.. ​మంచిర్యాల పట్టణంలో చలివేంద్రాలను ప్రారంభించిన శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు ఏలూరు మెయిన్ రోడ్డు రహదారి నిర్మాణపు పనులు వేగవంతం చేయాలి.... ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి నియామకం నంద్యాల జిల్లా, ఆత్మకూరు మున్సిపాలిటీ నూతన మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి మేఘన ఎస్టేట్ బాధితుల తరపున కేంద్ర మంత్రి బండి సంజయ్ గారికి వినతి పత్రం అందజేత. పోలవరంలో మృతుని కుటుంబానికి పదివేల రూపాయలు అందజేత చాట్రాయిలో గౌతు లచ్చన్న వర్ధంతి సందర్భంగా ఘన నివాళి మూడు నెలల రేషన్ పంపిణీ.. క్యూలైన్‌లో గంటల తరబడి తిప్పలు... కరెంటు కోత.. ఉక్కపోత..
www.ntodaynews.com

బిసి డిమాండ్ల సాధనకై ఏప్రిల్ 7న 24 గంటల నిరవధిక దీక్ష

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజకవర్గ ప్రతినిధి
28 Mar, 2026 - 03:41 PM
33 వీక్షణలు

 బి.సి డిమాండ్ల సాధనకై ఏప్రిల్ 7న 24 గంటల నిరవధిక దీక్ష

మంచిర్యాల 

బి.సి కులాల చిరకాల డిమాండ్లను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈనెల ఏప్రిల్ 7వ తేదీ, మంగళవారం నాడు భారీ ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు జాతీయ బి.సి హక్కుల పోరాట సమితి ప్రకటించింది.

ముఖ్య అంశాలు:

గత 40 సంవత్సరాలుగా దేశంలో మరియు రాష్ట్రంలో బి.సి డిమాండ్ల సాధనకై అనేక ఉద్యమాలు జరుగుతున్నప్పటికీ, నేటికీ ఒక్క డిమాండ్ కూడా పరిష్కారానికి నోచుకోకపోవడం పట్ల సమితి నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వాల ఈ మొండి వైఖరిని "బి.సి వ్యతిరేక విధానం"గా వారు అభివర్ణించారు.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు గుమ్మల శ్రీనివాస్, నాయకులు షాకపూరి భీమ్సేన్, చంద్రమౌళి మాట్లాడుతూ... బి.సి కుల సంఘాలు, బి.సి మేధావులు మరియు కుల బాంధవులందరూ ఏకతాటిపైకి వచ్చి ఈ 24 గంటల నిరవధిక దీక్షను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి బి.సి ల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు