BREAKING
తమిళనాడులో మంత్రులకు శాఖల కేటాయింపు తమిళనాడు సీఎం విజయ్‌తో కమల్ హాసన్ భేటీ.. అభివృద్ధి పై చర్చ గుండ్రాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం : ఆగి ఉన్న డీసీఎంను ఢీకొట్టిన లారీ జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా అవగాహన పెంపుదలపై ప్రత్యేక దృష్టి ప్రైవేట్ ఆసుపత్రి బిల్లు కట్టలేదని డెడ్ బాడీని ఆపినా.. డిశ్చార్జ్ నిరాకరించినా.. అది నేరమే! రైతుల పంటలకు మద్దతు ధరల పెంపు మోసపూరితం స్టేషన్‌కే ఆలయ కళ… చిన్న తిరుపతిని తలపిస్తున్న ఏలూరు రైల్వే జంక్షన్ చనుబండలో గృహ నిర్మాణ పనులపై క్షేత్రస్థాయి పరిశీలన చనుబండ పిఏసియస్ సభ్యుడి కుటుంబానికి ఆర్థిక సాయం రైతులకు ఉపయోగకరంగా APAIMS ఫార్మర్ యాప్ తమిళనాడులో మంత్రులకు శాఖల కేటాయింపు తమిళనాడు సీఎం విజయ్‌తో కమల్ హాసన్ భేటీ.. అభివృద్ధి పై చర్చ గుండ్రాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం : ఆగి ఉన్న డీసీఎంను ఢీకొట్టిన లారీ జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా అవగాహన పెంపుదలపై ప్రత్యేక దృష్టి ప్రైవేట్ ఆసుపత్రి బిల్లు కట్టలేదని డెడ్ బాడీని ఆపినా.. డిశ్చార్జ్ నిరాకరించినా.. అది నేరమే! రైతుల పంటలకు మద్దతు ధరల పెంపు మోసపూరితం స్టేషన్‌కే ఆలయ కళ… చిన్న తిరుపతిని తలపిస్తున్న ఏలూరు రైల్వే జంక్షన్ చనుబండలో గృహ నిర్మాణ పనులపై క్షేత్రస్థాయి పరిశీలన చనుబండ పిఏసియస్ సభ్యుడి కుటుంబానికి ఆర్థిక సాయం రైతులకు ఉపయోగకరంగా APAIMS ఫార్మర్ యాప్
www.ntodaynews.com

​బోరుబావిలో పడ్డ మనవడు. కాపాడబోయి తాత ప్రాణత్యాగం!

తెలంగాణ
/ నల్గొండ / మిర్యాలగూడ
Reporter
కూనురు మధు నల్గొండ జిల్లా ప్రతినిధి
16 May, 2026 - 04:23 PM
131 వీక్షణలు

​బోరుబావిలో పడ్డ మనవడు. కాపాడబోయి తాత ప్రాణత్యాగం! NTODAY NEWS మిర్యాలగూడ

మిర్యాలగూడ మండలం ఊట్లపల్లిలో హృదయ విదారక ఘటన

* ​నాలుగేళ్ల చిన్నారి సురక్షితం.. ఊపిరాడక వృద్ధుడు మృతి


మిర్యాలగూడ మండలం ఊట్లపల్లి గ్రామ శివారులో శనివారం ఒక అత్యంత హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు బోరు గుంతలో పడిపోయిన మనవడిని కాపాడబోయి, ఓ తాత తన ప్రాణాలనే పణంగా పెట్టాడు. చివరికి చిన్నారి ప్రాణాలతో బయటపడగా తాత మాత్రం ఊపిరాడక కన్నుమూశాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఊట్లపల్లి ​గ్రామానికి చెందిన వెంకన్న అనే వృద్ధుడి నాలుగేళ్ల మనవడు ఇంటి సమీపంలో ఆడుకుంటూ వెళ్లాడు. ఈ క్రమంలో అక్కడే తెరిచి ఉన్న ఒక బోరు గుంతలో ప్రమాదవశాత్తు పడిపోయాడు. గమనించిన తాత వెంకన్న. నా మనవడిని కాపాడాలి’ అంటూ క్షణం కూడా ఆలోచించకుండా  తన ప్రాణాలను లెక్కచేయకుండా వెంటనే ఆ బోరు గుంతలోకి దిగాడు. అయితే లోతైన ఆ గుంతలో ఊపిరాడక తాత, మనవడు ఇద్దరూ ఇరుక్కుపోయారు. గమనించిన స్థానికులు గట్టిగా కేకలు వేయడంతో గ్రామంలో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. ​స్థానికుల సమాచారంతో మిర్యాలగూడ రూరల్ పోలీసులు, రెస్క్యూ సిబ్బంది యుద్ధప్రాతిపదికన ఘటనాస్థలానికి చేరుకున్నారు. జనం గుమికూడటంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రాణాలను కాపాడేందుకు పోలీసులు, సహాయక సిబ్బంది గంటల తరబడి ఉత్కంఠభరితంగా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. తీవ్ర శ్రమకోర్చి చివరికి నాలుగేళ్ల చిన్నారిని సురక్షితంగా బయటకు తీశారు. ​చిన్నారి ప్రాణాలతో బయటపడినప్పటికీ.. అప్పటికే గుంతలో ఊపిరాడక తీవ్ర అస్వస్థతకు గురైన తాత వెంకన్న పరిస్థితి విషమంగా మారింది. ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే కన్నుమూశారు. మనవడి కోసం తాత ప్రాణత్యాగం చేసిన ఉదంతం విన్న ఊట్లపల్లి గ్రామమంతా కన్నీరుమున్నీరైంది. వెంకన్న మృతితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
​సమయస్ఫూర్తితో స్పందించి, రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి చిన్నారి ప్రాణాలను కాపాడిన మిర్యాలగూడ రూరల్ పోలీసులను, రెస్క్యూ సిబ్బందిని స్థానిక ప్రజలు అభినందించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.