www.ntodaynews.com
బొప్పూడి ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థాన ఇన్చార్జ్ ఈవోగా బి. అశోక్ కుమార్ బాధ్యతల స్వీకరణ
ఆంధ్రప్రదేశ్
/
పల్నాడు
చిలకలూరిపేట: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బొప్పూడి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం (బొప్పూడి గ్రూప్ టెంపుల్స్) ఇన్చార్జ్ కార్యనిర్వహణాధికారి (ఈవో)గా చిలకలూరిపేట గ్రూప్ టెంపుల్స్ ఈవో బి. అశోక్ కుమార్ నేడు బాధ్యతలు స్వీకరించారు.
ఇప్పటివరకు ఇక్కడ ఈవోగా విధులు నిర్వహించిన సత్యనారాయణరెడ్డి పదవీ విరమణ పొందడంతో ఈ పోస్టు ఖాళీ అయింది. ఈ నేపథ్యంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు, ప్రస్తుతం చిలకలూరిపేట ఈవోగా ఉన్న బి. అశోక్ కుమార్కు బొప్పూడి గ్రూపు దేవస్థానాల అదనపు బాధ్యతలను (అడిషనల్ చార్జ్) అప్పగించారు.