www.ntodaynews.com
బ్రిటన్ హౌస్ ఆఫ్ లార్డ్స్కు ఎన్నికైన తెలంగాణ బిడ్డ ఉదయ్ నాగరాజుకు కేటీఆర్ ఘన సన్మానం
జాతీయం
బ్రిటన్ హౌస్ ఆఫ్ లార్డ్స్కు ఎన్నికైన తెలంగాణ బిడ్డ ఉదయ్ నాగరాజుకు కేటీఆర్ ఘన సన్మానం
న్యూఢిల్లీ: తెలంగాణకు చెందిన ప్రముఖ ప్రవాస భారతీయుడు ఉదయ్ నాగరాజు బ్రిటన్ హౌస్ ఆఫ్ లార్డ్స్కు ఎన్నిక కావడం గర్వకారణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఢిల్లీలో నిర్వహించిన అభినందన సభలో పాల్గొన్న ఆయన ఉదయ్ నాగరాజును ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, దామోదర్ రావు, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకుడు జాన్సన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. బ్రిటన్ హౌస్ ఆఫ్ లార్డ్స్కు ఎన్నికైన తొలి తెలుగు వ్యక్తిగా ఉదయ్ నాగరాజు సాధించిన విజయాన్ని వారు అభినందించారు.