BREAKING
ఎన్.టి.ఆర్. కాంప్లెక్స్‌లో యు.జి. ఆనర్స్ 4 సెమిస్టర్ పరీక్షలు మంచిర్యాల మెడికల్ కాలేజీ విద్యార్థులపై స్థానిక యువకుల దాడి చింతలపూడి అన్న క్యాంటీన్ ప్రతిపాదన సిద్ధం చేయాలని శాసనసభ్యులు రోషన్ కుమార్ ఆదేశం టిడిపి యాప్ లో పుంగనూరు నియోజకవర్గ మొదటి స్థానం కైవసం చేసుకొన్న చెన్న కేశవ నాయుడు... ప్రకృతి వ్యవసాయ పంటలను పరిశీలించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ప్రభుత్వ బడి తల్లి ఒడి ర్యాలీ భక్తిశ్రద్ధలతో శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆలయ 15వ వార్షికోత్సవం​ మంత్రి ఆడ్లూరిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోము ​జన్నారం మండలంలో విషాదం వ్యక్తి దుర్మరణం హుజురాబాద్ కు సమీపంలోని వెస్ట్ టూ ఎనర్జీ ప్రాజెక్ట్ ను వెంటనే రద్దు చేయాలి ఎన్.టి.ఆర్. కాంప్లెక్స్‌లో యు.జి. ఆనర్స్ 4 సెమిస్టర్ పరీక్షలు మంచిర్యాల మెడికల్ కాలేజీ విద్యార్థులపై స్థానిక యువకుల దాడి చింతలపూడి అన్న క్యాంటీన్ ప్రతిపాదన సిద్ధం చేయాలని శాసనసభ్యులు రోషన్ కుమార్ ఆదేశం టిడిపి యాప్ లో పుంగనూరు నియోజకవర్గ మొదటి స్థానం కైవసం చేసుకొన్న చెన్న కేశవ నాయుడు... ప్రకృతి వ్యవసాయ పంటలను పరిశీలించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ప్రభుత్వ బడి తల్లి ఒడి ర్యాలీ భక్తిశ్రద్ధలతో శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆలయ 15వ వార్షికోత్సవం​ మంత్రి ఆడ్లూరిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోము ​జన్నారం మండలంలో విషాదం వ్యక్తి దుర్మరణం హుజురాబాద్ కు సమీపంలోని వెస్ట్ టూ ఎనర్జీ ప్రాజెక్ట్ ను వెంటనే రద్దు చేయాలి
www.ntodaynews.com

డా||బీ.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఘన నివాళి

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
14 Apr, 2026 - 02:47 PM
102 వీక్షణలు

భారత రత్న డా. బీ.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా మోరంపూడి శ్రీనివాస రావు ఘన నివాళి

"విద్య పొందండి, సంఘటితమవ్వండి, పోరాడండి"అనే డా. బీ ఆర్ అంబేద్కర్ సందేశం  యువతకు మార్గదర్శనం అని నూజివీడు నియోజక వర్గ తెలుగు రైతు అధ్యక్షుడు మోరంపూడి శ్రీనివాస రావు అన్నారు.

మంగళవారం ఉదయం భారత రత్న డా. బీ. ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి సందర్భంగా చాట్రాయి మండలం, చనుబండ గ్రామంలో స్వర్గీయ అంబేద్కర్  విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.

ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత, సంఘ సంస్కర్త, విద్యా వేత్త, న్యాయ కోవిదుడు, కేంద్ర మాజీ న్యాయ శాఖా మంత్రి, భారత రత్న స్వర్గీయ డా. భీమ్ రావ్ , రాంజీ అంబేద్కర్ కుల వివక్ష కు వ్యతిరేకంగా, స్వేచ్ఛ, సమానత్వం కోసం జీవితాంతం పోరాడారు అని మోరంపూడి కొనియాడారు.

అతి సామాన్య దళిత కుటుంబంలో పుట్టి ,అంటరానితనానికి లోనై, అస్పృశ్యత కు గురై, వాటిని లెక్కచేయకుండా బాగా చదువుకొని భారత రాజ్యాంగాన్ని  రచించే మహదావకాశాన్ని అందిపుచ్చుకున్నారనీ మోరంపూడి అన్నారు.

విద్య లేక పోతే స్వేచ్ఛ లేదు, సంఘటితం కాకపోతే శక్తి లేదు, పోరాడకపోతే మార్పు రాదు అని యువత కు గట్టిగా అంబేద్కర్ ఉద్బోధించారు అని మోరంపూడి గుర్తు చేశారు.

టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ కూడా అంబేద్కర్ భావజాలాన్ని అమలు చేశారనడానికి నిదర్శనమే కే ఆర్ నారాయణన్ ని రాష్ట్రపతి ని చేయడం గానీ, బాలయోగి నీ లోక్ సభ కు స్పీకర్ ని చేయడం గానీ అని మోరంపూడి అన్నారు.

ఈ కార్యక్రమంలో చీదిరాల మారేశ్వర రావు, నక్కా రాము, జక్కంపూడి ప్రదీప్, నెక్కళపు వెంకటేశ్వర రావు, గార్లపాటి మారేష్,బొంతు సతీష్, గవర వెంకటేశ్వర రావు, మోదుగు ముత్తయ్య, మోదుగు లక్ష్మీ విమల కుమారి, విస్సంపల్లి రాజా, కందుల కృష్ణ, మౌలాలి, గత్తం రాజు, ఫిరంగి పుల్లయ్య, మోరంపూడి రమేష్, విస్సంపల్లి ప్రసాద్,కూటమి నాయకులు,కార్యకర్తలు, దళిత నాయకులు, అంబేద్కర్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.