BREAKING
ప్రభుత్వ పాఠశాల అంటే అమ్మ ఒడిలాంటిది జూన్ 12న పాఠశాలలలో విద్యార్థులతో ప్రతిజ్ఞ పోలవరం గ్రామంలో వీధి కుక్కల బెడదపై చర్యలు తీసుకోవాలి అంబేద్కర్ విగ్రహానికి 46వ వారం జ్ఙానమాల కార్యక్రమం.. అనంతపురంలో ఏసీబీ వలలో మున్సిపల్ అధికారులు 22-A భూ సమస్యల పరిష్కారం!… రైతులకు, ప్రజలకు ఊరట! చెక్కపల్లిలో భూదాన భూములను గుర్తించి పేదలకు పంచాలి ఏలూరు జిల్లాలో అక్రమ PDS మాఫియా కలకలం కన్నుల పండుగగా శ్రీ మహాలింగేశ్వర స్వామి కళ్యాణం రైతుల పక్షాన పోరాడుతా.. మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ప్రభుత్వ పాఠశాల అంటే అమ్మ ఒడిలాంటిది జూన్ 12న పాఠశాలలలో విద్యార్థులతో ప్రతిజ్ఞ పోలవరం గ్రామంలో వీధి కుక్కల బెడదపై చర్యలు తీసుకోవాలి అంబేద్కర్ విగ్రహానికి 46వ వారం జ్ఙానమాల కార్యక్రమం.. అనంతపురంలో ఏసీబీ వలలో మున్సిపల్ అధికారులు 22-A భూ సమస్యల పరిష్కారం!… రైతులకు, ప్రజలకు ఊరట! చెక్కపల్లిలో భూదాన భూములను గుర్తించి పేదలకు పంచాలి ఏలూరు జిల్లాలో అక్రమ PDS మాఫియా కలకలం కన్నుల పండుగగా శ్రీ మహాలింగేశ్వర స్వామి కళ్యాణం రైతుల పక్షాన పోరాడుతా.. మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి
www.ntodaynews.com

డా||బీ.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఘన నివాళి

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
14 Apr, 2026 - 02:47 PM
107 వీక్షణలు

భారత రత్న డా. బీ.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా మోరంపూడి శ్రీనివాస రావు ఘన నివాళి

"విద్య పొందండి, సంఘటితమవ్వండి, పోరాడండి"అనే డా. బీ ఆర్ అంబేద్కర్ సందేశం  యువతకు మార్గదర్శనం అని నూజివీడు నియోజక వర్గ తెలుగు రైతు అధ్యక్షుడు మోరంపూడి శ్రీనివాస రావు అన్నారు.

మంగళవారం ఉదయం భారత రత్న డా. బీ. ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి సందర్భంగా చాట్రాయి మండలం, చనుబండ గ్రామంలో స్వర్గీయ అంబేద్కర్  విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.

ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత, సంఘ సంస్కర్త, విద్యా వేత్త, న్యాయ కోవిదుడు, కేంద్ర మాజీ న్యాయ శాఖా మంత్రి, భారత రత్న స్వర్గీయ డా. భీమ్ రావ్ , రాంజీ అంబేద్కర్ కుల వివక్ష కు వ్యతిరేకంగా, స్వేచ్ఛ, సమానత్వం కోసం జీవితాంతం పోరాడారు అని మోరంపూడి కొనియాడారు.

అతి సామాన్య దళిత కుటుంబంలో పుట్టి ,అంటరానితనానికి లోనై, అస్పృశ్యత కు గురై, వాటిని లెక్కచేయకుండా బాగా చదువుకొని భారత రాజ్యాంగాన్ని  రచించే మహదావకాశాన్ని అందిపుచ్చుకున్నారనీ మోరంపూడి అన్నారు.

విద్య లేక పోతే స్వేచ్ఛ లేదు, సంఘటితం కాకపోతే శక్తి లేదు, పోరాడకపోతే మార్పు రాదు అని యువత కు గట్టిగా అంబేద్కర్ ఉద్బోధించారు అని మోరంపూడి గుర్తు చేశారు.

టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ కూడా అంబేద్కర్ భావజాలాన్ని అమలు చేశారనడానికి నిదర్శనమే కే ఆర్ నారాయణన్ ని రాష్ట్రపతి ని చేయడం గానీ, బాలయోగి నీ లోక్ సభ కు స్పీకర్ ని చేయడం గానీ అని మోరంపూడి అన్నారు.

ఈ కార్యక్రమంలో చీదిరాల మారేశ్వర రావు, నక్కా రాము, జక్కంపూడి ప్రదీప్, నెక్కళపు వెంకటేశ్వర రావు, గార్లపాటి మారేష్,బొంతు సతీష్, గవర వెంకటేశ్వర రావు, మోదుగు ముత్తయ్య, మోదుగు లక్ష్మీ విమల కుమారి, విస్సంపల్లి రాజా, కందుల కృష్ణ, మౌలాలి, గత్తం రాజు, ఫిరంగి పుల్లయ్య, మోరంపూడి రమేష్, విస్సంపల్లి ప్రసాద్,కూటమి నాయకులు,కార్యకర్తలు, దళిత నాయకులు, అంబేద్కర్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.