BREAKING
మెగా ఫ్యామిలీ వీరాభిమాని ధారకొండ వెంకటరమణ (47) ఇకలేరు.. నకిరేకల్‌లో ఘనంగా మారథాన్ ర్యాలీ చెప్పులు లేకుండా 11,600 కిలోమీటర్ల పాదయాత్ర మురికి కాలువల గురించి పట్టించుకోని అధికారులు బోయకొండ ఆలయంలో కిక్కిరిస్తున్న భక్తజనం కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య హార్టికల్చర్ అధికారి నరేంద్ర కుమార్‌కు ఘన సన్మానం హైకోర్టు జడ్జిపై ట్రోలింగ్.. కేసు నమోదు బండి సంజయ్‌ను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలి తలుపులమ్మ లోవ భక్తజనం మెగా ఫ్యామిలీ వీరాభిమాని ధారకొండ వెంకటరమణ (47) ఇకలేరు.. నకిరేకల్‌లో ఘనంగా మారథాన్ ర్యాలీ చెప్పులు లేకుండా 11,600 కిలోమీటర్ల పాదయాత్ర మురికి కాలువల గురించి పట్టించుకోని అధికారులు బోయకొండ ఆలయంలో కిక్కిరిస్తున్న భక్తజనం కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య హార్టికల్చర్ అధికారి నరేంద్ర కుమార్‌కు ఘన సన్మానం హైకోర్టు జడ్జిపై ట్రోలింగ్.. కేసు నమోదు బండి సంజయ్‌ను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలి తలుపులమ్మ లోవ భక్తజనం
www.ntodaynews.com

భగవద్గీత పారాయణంలో బంగారు పతకం సాధించిన చిన్నంపేట వాసి సునీత

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
17 May, 2026 - 05:30 PM
164 వీక్షణలు

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చిన్నంపేట గ్రామానికి చెందిన నృసింహాద్రి సునీత భగవద్గీత పారాయణంలో ప్రతిభ కనబర్చి బంగారు పతకం సాధించారు. గత ఏడాది కాలంగా మైసూర్ అవధూత దత్త పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామి ఆశీస్సులతో నిర్వహించిన శ్రీమద్భగవద్గీత పారాయణ తరగతుల్లో పాల్గొన్న సునీత, భగవద్గీతలోని 18 అధ్యాయాలు, 700 శ్లోకాలను కంఠస్థం చేసి తన ప్రతిభను చాటుకున్నారు.

ఈ నెల 10వ తేదీన మైసూరులో నిర్వహించిన కార్యక్రమంలో గణపతి సచ్చిదానంద స్వామి సునీతను బంగారు పతకం, ప్రశంసాపత్రంతో ఘనంగా సత్కరించారు.

ఈ విషయం తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం చాట్రాయి మండల కార్యదర్శి కొమ్ము ఆనందం, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. సునీత భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించి, అనేక మందికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.