BREAKING
జనగనణ ప్రారంభం - భూమా అఖిలప్రియరెడ్డి MLA ఆళ్లగడ్డ ​గూడెం గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి.. ​మంచిర్యాల పట్టణంలో చలివేంద్రాలను ప్రారంభించిన శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు ఏలూరు మెయిన్ రోడ్డు రహదారి నిర్మాణపు పనులు వేగవంతం చేయాలి.... ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి నియామకం నంద్యాల జిల్లా, ఆత్మకూరు మున్సిపాలిటీ నూతన మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి మేఘన ఎస్టేట్ బాధితుల తరపున కేంద్ర మంత్రి బండి సంజయ్ గారికి వినతి పత్రం అందజేత. పోలవరంలో మృతుని కుటుంబానికి పదివేల రూపాయలు అందజేత చాట్రాయిలో గౌతు లచ్చన్న వర్ధంతి సందర్భంగా ఘన నివాళి మూడు నెలల రేషన్ పంపిణీ.. క్యూలైన్‌లో గంటల తరబడి తిప్పలు... కరెంటు కోత.. ఉక్కపోత.. జనగనణ ప్రారంభం - భూమా అఖిలప్రియరెడ్డి MLA ఆళ్లగడ్డ ​గూడెం గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి.. ​మంచిర్యాల పట్టణంలో చలివేంద్రాలను ప్రారంభించిన శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు ఏలూరు మెయిన్ రోడ్డు రహదారి నిర్మాణపు పనులు వేగవంతం చేయాలి.... ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి నియామకం నంద్యాల జిల్లా, ఆత్మకూరు మున్సిపాలిటీ నూతన మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి మేఘన ఎస్టేట్ బాధితుల తరపున కేంద్ర మంత్రి బండి సంజయ్ గారికి వినతి పత్రం అందజేత. పోలవరంలో మృతుని కుటుంబానికి పదివేల రూపాయలు అందజేత చాట్రాయిలో గౌతు లచ్చన్న వర్ధంతి సందర్భంగా ఘన నివాళి మూడు నెలల రేషన్ పంపిణీ.. క్యూలైన్‌లో గంటల తరబడి తిప్పలు... కరెంటు కోత.. ఉక్కపోత..
www.ntodaynews.com

ప్రతిష్టాత్మక భూభారతి పోర్టల్‌ ప్రారంభం

తెలంగాణ
/ రంగారెడ్డి
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
02 Apr, 2026 - 09:19 PM
89 వీక్షణలు

​భూ సమస్యలకు చెక్: ప్రతిష్టాత్మక 'భూభారతి' పోర్టల్‌ను ప్రారంభించిన మంత్రి పొంగులేటి

​ఆమనగల్, ఏప్రిల్ 02:

రాష్ట్రంలో దశాబ్దాలుగా వేధిస్తున్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలం విఠాయిపల్లిలో ఇంటిగ్రేటెడ్ 'భూభారతి' పోర్టల్‌ను రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురువారం ప్రారంభించారు. సర్వే, రిజిస్ట్రేషన్, భూ వివరాలన్నీ ఒకే చోట లభించేలా, ప్రతి సర్వే నంబర్‌కు 'భూధార్' ఇచ్చేలా ఈ పోర్టల్‌ను రూపొందించారు.

​ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రైతులు ఏ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, స్మార్ట్ ఫోన్ ద్వారానే తమ భూ సమస్యలను పరిష్కరించుకోవచ్చని తెలిపారు. పాత సర్వే పద్ధతులకు స్వస్తి పలికి, కొత్త టెక్నాలజీతో పక్కాగా భూలెక్కలు తేలుస్తామని హామీ ఇచ్చారు.

​వార్తలోని ముఖ్యాంశాలు:

​పైలెట్ ప్రాజెక్ట్: మొదటి దశలో ఆమనగల్ (రంగారెడ్డి), కూసుమంచి (ఖమ్మం), అశ్వారావుపేట (భద్రాద్రి కొత్తగూడెం), వట్‌పల్లి (సంగారెడ్డి), కోస్గి (నారాయణపేట) మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు.

​రెండో దశ: 45 రోజుల తర్వాత జిల్లాకో మండలం చొప్పున ఎంపిక చేసి, ప్రతి జిల్లాలో 70 గ్రామాల్లో పూర్తిస్థాయి సర్వే.

​సాదాబైనామాల పరిష్కారం: వీలైనంత త్వరగా సాదాబైనామాల సమస్యలను క్లియర్ చేస్తామని స్పష్టం చేసిన మంత్రి.

​భూధార్: ఆధార్ తరహాలోనే ప్రతి భూమికి ఒక విశిష్ట గుర్తింపు సంఖ్య (భూధార్) కేటాయింపు.

​ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు