www.ntodaynews.com
పుంగనూరులో రక్తదాన శిబిరం నిర్వహణ
తెలంగాణ
పుంగనూరులో రక్తదాన శిబిరం నిర్వహణ
రెడ్ క్రాస్ సహకారంతో రోటరీ క్లబ్, మానవతా సంస్థల ఆధ్వర్యంలో కార్యక్రమం
NTODAY NEWS: పుంగనూరు, ప్రతినిధి రాఘవేంద్ర రాజు
పుంగనూరు పట్టణంలోని బసవరాజ డిగ్రీ కళాశాల ఆవరణలో మంగళవారం రక్తదాన శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించారు. అన్నమయ్య జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో రోటరీ క్లబ్ మరియు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో ఈ శిబిరం జరిగింది.
కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపక బృందం, ఎన్సీసీ విద్యార్థుల సమన్వయంతో నిర్వహించిన ఈ శిబిరంలో సుమారు 35 మంది విద్యార్థులు, యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.
రక్తదానం చేసిన వారికి రోటరీ క్లబ్ సభ్యులు పౌష్టికాహారం అందించడంతో పాటు ప్రశంసా పత్రాలు అందజేసి అభినందించారు. రక్తదానం ద్వారా అత్యవసర పరిస్థితుల్లో అనేక ప్రాణాలను కాపాడవచ్చని నిర్వాహకులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షుడు నాన బాల గణేష్, కార్యదర్శి సిఎస్ రాజారెడ్డి, సభ్యులు డాక్టర్ ప్రభాకర్, భాస్కర జెట్టి, ఇట్టా శ్రీధర్, ఈఎస్ భాస్కర్, అనిల్ కుమార్ పాల్గొన్నారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి ఏసీ నారాయణరెడ్డి, హరినాథ్ రెడ్డి, నందీశ్వరయ్య, సరస్వతి తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube