చాట్రాయి మండలంలో నాలుగు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు చోరీ
నూజివీడు డివిజన్ రిపోర్టర్ అమెర్ల ధర్మా రావు
ఏలూరు జిల్లా, చాట్రాయి: చాట్రాయి మండలంలోని సోమవరం, మర్లపాలెం గ్రామాల్లో నాలుగు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు చోరీకి గురైనట్లు విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ డి. సంజయ్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గుర్తుతెలియని వ్యక్తులు వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను అపహరించారని, ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ట్రాన్స్ఫార్మర్ల చోరీ కారణంగా ఆయా గ్రామాల్లోని వ్వవసాయ రైతులకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగే అవకాశం ఉందని తెలిపారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారని పేర్కొన్నారు. గ్రామాల్లోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల భద్రతపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాలు కనిపిస్తే వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు లేదా పోలీసులకు సమాచారం అందించాలని అసిస్టెంట్ ఇంజనీర్ డి. సంజయ్ కోరారు.