చౌటుప్పల్ మున్సిపాలిటీ లో ఘనంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు
చౌటుప్పల్ మున్సిపాలిటీ లో ఘనంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు
చౌటుప్పల్ మున్సిపాలిటీ లోని ఆంజనేయ స్వామి దేవాలయాలలో పూజలు విశేషం గా నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా పెరుమాండ్ల ఆంజనేయ స్వామి దేవాలయం లో మున్సిపల్ చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ పూజలలో పాల్గొని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో దేవాలయ అధ్యక్షులు నామని వీరేశం మరియు కార్యవర్గ సభ్యులు పాల్గొనడం జరిగింది. తధానంతరం పాటిమీది వీరాంజనేయ స్వామి దేవాలయం లో చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ పాల్గొని విశేషమైన పూజల అనంతరం మాట్లాడుతూ ప్రజలందరూ భక్తి శ్రద్దలతో ఉంటూ ఆ ఆంజనేయ స్వామి కృపకు పాత్రులు కాగలరని అన్నారు. ఈ కార్యక్రమం లో దేవాలయ అధ్యక్షులు సందగల్ల నాగరాజు, కార్యవర్గ సభ్యులు మరియు చౌటుప్పల్ మున్సిపాలిటీ కౌన్సిలర్లు అందరూ పాల్గొని పూజా కార్యక్రమాల అనంతరం హనుమాన్ శోభయాత్ర లో పాల్గొనడం జరిగింది.