చౌటుప్పల్ మున్సిపాలిటీలో తాగునీటి సరఫరాపై అదనపు కలెక్టర్ సమీక్ష సమావేశం
మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిరంతరాయంగా తాగునీటి సరఫరా అందించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు సంబంధిత అధికారులను ఆదేశించారు.శుక్రవారం రోజున చౌటుప్పల్ మున్సిపాలిటీలో తాగునీటి సరఫరాపై అదనపు కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ... వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని నీటి కొరత ఏర్పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.తాగునీటి సరఫరా వ్యవస్థ, పైప్లైన్ మరమ్మతులు,నీటి నిల్వలు,పంపింగ్ వ్యవస్థను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.వార్డులో ఎక్కడైనా తాగునీటి సమస్య తలెత్తితే వెంటనే స్పందించి పరిష్కరించి, అవసరమైన ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలని తెలిపారు.ఈ సమావేశంలో ఆర్డీవో శేఖర్ రెడ్డి,మున్సిపల్ కమిషనర్, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.