www.ntodaynews.com
చింతలపూడి బార్ కౌన్సిల్ అధ్యక్షులు గా కల్లేపల్లి సూరయ్య
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
చింతలపూడి బార్ కౌన్సిల్ అధ్యక్షులు గా కల్లేపల్లి సూరయ్య
చింతలపూడి బార్ కౌన్సిల్ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేసిన కల్లేపల్లి సూరయ్య విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ఆయనకు న్యాయవాదుల నుంచి విశేష మద్దతు లభించడంతో స్పష్టమైన మెజారిటీతో గెలుపొందినట్లు సమాచారం.
సూరయ్య గెలుపుతో ఆయన అనుచరులు, మద్దతుదారులు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. బార్ అసోసియేషన్ అభివృద్ధి, న్యాయవాదుల సంక్షేమం కోసం కృషి చేస్తానని ఈ సందర్భంగా సూరయ్య పేర్కొన్నారు.