BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

చింతలపూడిలో గ్యాస్ కష్టాలు… వినియోగదారుల ఆవేదన

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 May, 2026 - 01:17 PM
113 వీక్షణలు

చింతలపూడిలో గ్యాస్ కష్టాలు… వినియోగదారుల ఆవేదన

చింతలపూడి ప్రాంతంలో వంటగ్యాస్ సరఫరా సమస్యలు తీవ్రంగా మారాయి. ఒకే ఏజెన్సీ వద్ద సుమారు 25 వేల కనెక్షన్లు ఉండగా, ఇతర ఏజెన్సీల వద్ద కేవలం 5 వేల కనెక్షన్లు మాత్రమే ఉండటంతో అసమతుల్యత ఏర్పడిందని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ కారణంగానే సరఫరాలో అంతరాయం కలుగుతోందని వారు అంటున్నారు.

ఒకే ఏజెన్సీకి ఇంత భారీ సంఖ్యలో కనెక్షన్లు ఉండటం కంటే, వాటిని ఇతర ఏజెన్సీలకు సమానంగా బదిలీ చేయవచ్చుకదా అని ప్రశ్నిస్తున్నారు. 5 వేల కనెక్షన్లు ఉన్న ఏజెన్సీలకు సరిపడా గ్యాస్ సరఫరా ఉంటే, 25 వేల కనెక్షన్లు ఉన్న ఏజెన్సీకి కూడా అదే స్థాయిలో సరఫరా జరుగుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇదిలా ఉండగా, కొందరు సిలిండర్లు బ్లాక్‌లో అమ్ముడవుతున్నాయా? లేదా ఈ-కేవైసీ పేరుతో ఆలస్యం చేస్తున్నారా? అనే అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి. స్పష్టమైన సమాచారం లేక వినియోగదారులు అయోమయంలో ఉన్నారు.

చింతలపూడి ఏజెన్సీ వద్ద వినియోగదారులు ఎండలో గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితిని వెంటనే పరిశీలించి సమస్యను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ను ప్రజలు కోరుతున్నారు.