BREAKING
గొల్లప్రోలులో పశువుల అక్రమ రవాణాపై పోలీసుల దాడి.. 12 ఎద్దులు స్వాధీనం గొల్లప్రోలులో కాల్వల ఆక్రమణలపై ఆందోళన.. డ్రైనేజీ వ్యవస్థకు ముప్పు? ప్రజల సమస్యలపై శాఖాధిపతులు ప్రత్యేక దృష్టి పెట్టాలి ఉపాధి హామీ పథకంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఊరట.. 90 రోజుల ఉపాధి అవకాశం భారత్‌కు పాకిస్తాన్ హెచ్చరికలు.. మళ్లీ పెరుగుతున్న ఉద్రిక్తత యావత్ ప్రపంచానికి యోగాను అందించిన విశ్వగురువు భారతదేశం! ​డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. క్షణాల్లో బూడిదైన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు కాకినాడ ప్రెస్ క్లబ్ సభ్యుల సంక్షేమమే మా ధ్యేయం: అధ్యక్షులు అచ్యుత రామారావు గొల్లప్రోలులో నాటు సారా విక్రేత అరెస్ట్.. 5 లీటర్ల సారా స్వాధీనం స్నేహితుడి కుటుంబానికి అండగా సిరిపురం పదవ తరగతి పూర్వ విద్యార్థులు గొల్లప్రోలులో పశువుల అక్రమ రవాణాపై పోలీసుల దాడి.. 12 ఎద్దులు స్వాధీనం గొల్లప్రోలులో కాల్వల ఆక్రమణలపై ఆందోళన.. డ్రైనేజీ వ్యవస్థకు ముప్పు? ప్రజల సమస్యలపై శాఖాధిపతులు ప్రత్యేక దృష్టి పెట్టాలి ఉపాధి హామీ పథకంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఊరట.. 90 రోజుల ఉపాధి అవకాశం భారత్‌కు పాకిస్తాన్ హెచ్చరికలు.. మళ్లీ పెరుగుతున్న ఉద్రిక్తత యావత్ ప్రపంచానికి యోగాను అందించిన విశ్వగురువు భారతదేశం! ​డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. క్షణాల్లో బూడిదైన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు కాకినాడ ప్రెస్ క్లబ్ సభ్యుల సంక్షేమమే మా ధ్యేయం: అధ్యక్షులు అచ్యుత రామారావు గొల్లప్రోలులో నాటు సారా విక్రేత అరెస్ట్.. 5 లీటర్ల సారా స్వాధీనం స్నేహితుడి కుటుంబానికి అండగా సిరిపురం పదవ తరగతి పూర్వ విద్యార్థులు
www.ntodaynews.com

చింతలపూడిలో గ్యాస్ కష్టాలు… వినియోగదారుల ఆవేదన

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 May, 2026 - 01:17 PM
73 వీక్షణలు

చింతలపూడిలో గ్యాస్ కష్టాలు… వినియోగదారుల ఆవేదన

చింతలపూడి ప్రాంతంలో వంటగ్యాస్ సరఫరా సమస్యలు తీవ్రంగా మారాయి. ఒకే ఏజెన్సీ వద్ద సుమారు 25 వేల కనెక్షన్లు ఉండగా, ఇతర ఏజెన్సీల వద్ద కేవలం 5 వేల కనెక్షన్లు మాత్రమే ఉండటంతో అసమతుల్యత ఏర్పడిందని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ కారణంగానే సరఫరాలో అంతరాయం కలుగుతోందని వారు అంటున్నారు.

ఒకే ఏజెన్సీకి ఇంత భారీ సంఖ్యలో కనెక్షన్లు ఉండటం కంటే, వాటిని ఇతర ఏజెన్సీలకు సమానంగా బదిలీ చేయవచ్చుకదా అని ప్రశ్నిస్తున్నారు. 5 వేల కనెక్షన్లు ఉన్న ఏజెన్సీలకు సరిపడా గ్యాస్ సరఫరా ఉంటే, 25 వేల కనెక్షన్లు ఉన్న ఏజెన్సీకి కూడా అదే స్థాయిలో సరఫరా జరుగుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇదిలా ఉండగా, కొందరు సిలిండర్లు బ్లాక్‌లో అమ్ముడవుతున్నాయా? లేదా ఈ-కేవైసీ పేరుతో ఆలస్యం చేస్తున్నారా? అనే అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి. స్పష్టమైన సమాచారం లేక వినియోగదారులు అయోమయంలో ఉన్నారు.

చింతలపూడి ఏజెన్సీ వద్ద వినియోగదారులు ఎండలో గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితిని వెంటనే పరిశీలించి సమస్యను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ను ప్రజలు కోరుతున్నారు.