BREAKING
జూన్ 12న పాఠశాలలలో విద్యార్థులతో ప్రతిజ్ఞ పోలవరం గ్రామంలో వీధి కుక్కల బెడదపై చర్యలు తీసుకోవాలి అంబేద్కర్ విగ్రహానికి 46వ వారం జ్ఙానమాల కార్యక్రమం.. అనంతపురంలో ఏసీబీ వలలో మున్సిపల్ అధికారులు 22-A భూ సమస్యల పరిష్కారం!… రైతులకు, ప్రజలకు ఊరట! చెక్కపల్లిలో భూదాన భూములను గుర్తించి పేదలకు పంచాలి ఏలూరు జిల్లాలో అక్రమ PDS మాఫియా కలకలం కన్నుల పండుగగా శ్రీ మహాలింగేశ్వర స్వామి కళ్యాణం రైతుల పక్షాన పోరాడుతా.. మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి చిన్నకాపర్తిలో ఉపాధి కూలీలకు ఆరోగ్య కిట్ల పంపిణీ జూన్ 12న పాఠశాలలలో విద్యార్థులతో ప్రతిజ్ఞ పోలవరం గ్రామంలో వీధి కుక్కల బెడదపై చర్యలు తీసుకోవాలి అంబేద్కర్ విగ్రహానికి 46వ వారం జ్ఙానమాల కార్యక్రమం.. అనంతపురంలో ఏసీబీ వలలో మున్సిపల్ అధికారులు 22-A భూ సమస్యల పరిష్కారం!… రైతులకు, ప్రజలకు ఊరట! చెక్కపల్లిలో భూదాన భూములను గుర్తించి పేదలకు పంచాలి ఏలూరు జిల్లాలో అక్రమ PDS మాఫియా కలకలం కన్నుల పండుగగా శ్రీ మహాలింగేశ్వర స్వామి కళ్యాణం రైతుల పక్షాన పోరాడుతా.. మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి చిన్నకాపర్తిలో ఉపాధి కూలీలకు ఆరోగ్య కిట్ల పంపిణీ
www.ntodaynews.com

చింతలపూడిలో గ్యాస్ కష్టాలు… వినియోగదారుల ఆవేదన

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 May, 2026 - 01:17 PM
28 వీక్షణలు

చింతలపూడిలో గ్యాస్ కష్టాలు… వినియోగదారుల ఆవేదన

చింతలపూడి ప్రాంతంలో వంటగ్యాస్ సరఫరా సమస్యలు తీవ్రంగా మారాయి. ఒకే ఏజెన్సీ వద్ద సుమారు 25 వేల కనెక్షన్లు ఉండగా, ఇతర ఏజెన్సీల వద్ద కేవలం 5 వేల కనెక్షన్లు మాత్రమే ఉండటంతో అసమతుల్యత ఏర్పడిందని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ కారణంగానే సరఫరాలో అంతరాయం కలుగుతోందని వారు అంటున్నారు.

ఒకే ఏజెన్సీకి ఇంత భారీ సంఖ్యలో కనెక్షన్లు ఉండటం కంటే, వాటిని ఇతర ఏజెన్సీలకు సమానంగా బదిలీ చేయవచ్చుకదా అని ప్రశ్నిస్తున్నారు. 5 వేల కనెక్షన్లు ఉన్న ఏజెన్సీలకు సరిపడా గ్యాస్ సరఫరా ఉంటే, 25 వేల కనెక్షన్లు ఉన్న ఏజెన్సీకి కూడా అదే స్థాయిలో సరఫరా జరుగుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇదిలా ఉండగా, కొందరు సిలిండర్లు బ్లాక్‌లో అమ్ముడవుతున్నాయా? లేదా ఈ-కేవైసీ పేరుతో ఆలస్యం చేస్తున్నారా? అనే అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి. స్పష్టమైన సమాచారం లేక వినియోగదారులు అయోమయంలో ఉన్నారు.

చింతలపూడి ఏజెన్సీ వద్ద వినియోగదారులు ఎండలో గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితిని వెంటనే పరిశీలించి సమస్యను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ను ప్రజలు కోరుతున్నారు.