www.ntodaynews.com
చిట్టీల వ్యాపారం.. ప్రభుత్వ టీచర్ సస్పెన్షన్!
తెలంగాణ
హనుమకొండ జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్ వేటు పడింది. భీమదేవరపల్లి జడ్పీ హైస్కూల్లో పనిచేస్తున్న కలువల ఎల్లయ్య ప్రైవేట్ చిట్టీల వ్యాపారం నిర్వహిస్తూ సభ్యులను మోసగించినట్లు వచ్చిన ఫిర్యాదులపై విచారణ చేపట్టారు.
ఏప్రిల్లో జిల్లా కలెక్టర్కు అందిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు నిర్వహించిన డీఈవో ఎల్వీ గిరిరాజ్ గౌడ్కు ఆరోపణలు నిజమని తేలినట్లు సమాచారం. ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి ప్రైవేట్ చిట్టీల వ్యాపారం నిర్వహించడం నిబంధనలకు విరుద్ధమని గుర్తించిన అధికారులు, ఎల్లయ్యను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ ఘటన జిల్లాలో చర్చనీయాంశంగా మారగా, ప్రభుత్వ ఉద్యోగులు సేవా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.