చిట్యాలలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు ఘన స్వాగతం
చిట్యాలలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు ఘన స్వాగతం NTODAY NEWS చిట్యాల
నల్గొండలో బి ఆర్ ఎస్ పార్టీ నిర్వహించనున్న రైతు మహా ధర్నా కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తున్న బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నల్గొండ జిల్లా ఇంచార్జి, మాజీ ఐపిఎస్ (వి.ఆర్. ఎస్) అధికారి డా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు చిట్యాలలో బిఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య ఆదేశాల మేరకు చిట్యాల పట్టణ బిఆర్ఎస్ పార్టీ ఈ స్వాగత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా పూలమాలలు వేసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కూరెళ్ళ లింగస్వామి, మాజీ కౌన్సిలర్లు జిట్ట బొందయ్య, జమాండ్ల శ్రీనివాస్ రెడ్డి, 9వ వార్డు ఇంచార్జి ఆగు అశోక్, నాయకులు బొబ్బలి శివశంకర్ రెడ్డి, దయ్యాల శ్రీకాంత్, షేక్ అజీముద్దీన్, ఆవుల ఆనంద్, బోలుగూరి సైదులు, గౌస్ తదితర ముఖ్య నాయకులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.