BREAKING
చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు పేపర్ ప్లేట్ల వాడకంని నిషేధించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు పేపర్ ప్లేట్ల వాడకంని నిషేధించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్.
www.ntodaynews.com

చిట్యాలలో మిన్నంటిన బిఆర్‌ఎస్ రజతోత్సవ సంబరాలు

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
27 Apr, 2026 - 07:07 PM
232 వీక్షణలు

చిట్యాలలో మిన్నంటిన బిఆర్‌ఎస్ రజతోత్సవ సంబరాలు NTODAY NEWS చిట్యాల

తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా ఆవిర్భవించిన భారత్ రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్) 25వ వసంతంలోకి అడుగుపెట్టిన శుభసందర్భంగా సోమవారం చిట్యాల మండల కేంద్రంలో పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బిఆర్‌ఎస్ నాయకులు ఆగు అశోక్  ఆధ్వర్యం లో  మాజీ మార్కెట్ చైర్మన్ జడల ఆది మల్లయ్య పార్టీ జెండాను ఆవిష్కరించి కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే అన్ని రంగాల్లో విఫలమైందని విమర్శించారు. మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను నమ్మించి గద్దెనెక్కిన కాంగ్రెస్, నేడు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని, ప్రజలు మళ్లీ కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో  మాజీ జెడ్పిటిసి చేపూరి రవీందర్, సింగిల్ విండో వైస్ చైర్మన్ మెండే సైదులు, కూరెల్ల లింగస్వామి పాల్గొని ప్రసంగించారు. అలాగే కౌన్సిలర్లు ఎస్.కె షబానా అజీముద్దీన్, నిమ్మనగోటి శ్రీను, మారగోని రమేష్, భూలుగూరి సైదులు, వెంపాల వెంకన్న మరియు పార్టీ ముఖ్య కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.