www.ntodaynews.com
చనుబండ లో సిపిఐ సీనియర్ సభ్యురాలు వజ్రాల స్వరాజ్యలక్ష్మికి ఘన నివాళి
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చనుబండ గ్రామంలో సిపిఐ సీనియర్ సభ్యురాలు కామ్రేడ్ వజ్రాల స్వరాజ్యలక్ష్మి భౌతికకాయం వద్ద సిపిఐ రాష్ట్ర నాయకుడు కామ్రేడ్ చలసాని రామారావు, నూజివీడు నియోజకవర్గ కార్యదర్శి కామ్రేడ్ నిమ్మడ్డ నర్సింహ నివాళులర్పించారు.
ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ, కామ్రేడ్ వజ్రాల స్వరాజ్యలక్ష్మి ప్రజా సమస్యల పరిష్కారానికి, కార్మిక, రైతు, పేద ప్రజల హక్కుల సాధనకు చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆమె ఆశయాలను కొనసాగిస్తూ ప్రజా ఉద్యమాలను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొని పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.