BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

భవిష్యత్ తరాలకు ఆదర్శ రాజనీతిజ్ఞుడు చంద్రబాబు నాయుడు

తెలంగాణ
20 Apr, 2025 - 09:08 AM
328 వీక్షణలు
భవిష్యత్ తరాలకు ఆదర్శ రాజనీతిజ్ఞుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జంపాల సీతారామయ్య ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన వేడుకలు అభిమాన నాయకుడు జన్మదిన సందర్భంగా సర్వమత ప్రార్థనలు, రోగులకు పండు పంపిణీ అన్నదాన కార్యక్రమం ఇబ్రహీంపట్నం/కొండపల్లి ------------------------------------- చరిత్రలో అందరికీ గుర్తుండిపోయే భవిష్యత్తు తరాలకు ఆదర్శ రాజ నీతిజ్ఞుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని కొనియాడారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి జంపాల సీతారామయ్య.తమ అభిమాన నాయకుడు జన్మదినం సందర్భంగా పార్టీ నాయకులు కార్యకర్తలు ఇబ్రహీంపట్నం మరియు కొండపల్లిలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జంపాల సీతారామయ్య పాల్గొన్నారు. కేక్ కట్ చేసి ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తమ అభిమాన నాయకుడు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. ఇబ్రహీంపట్నం ప్రభుత్వ హాస్పటల్లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం ఇబ్రహీంపట్నంలో పేదలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. స్వయంగా అన్నదాన కార్యక్రమం ప్రారంభించి నాయకులు కార్యకర్తలు ప్రజలతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా జంపాల మాట్లాడుతూ అతలాకుతలమైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టి భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా అభివృద్ధి పథంలో నడిపిస్తున్న నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని అన్నారు. ప్రతి కార్యకర్తగా ఆయన ఆదర్శంగా తీసుకొని పార్టీ విధేయులుగా పనిచేయాలని సూచించారు. ఇలాంటి నాయకుడు దొరకటం రాష్ట్ర ప్రజల అదృష్టమని... ఆయన సారథంలో పనిచేయటం ప్రతి కార్యకర్త గర్వంగా భావించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కొండపల్లి మున్సిపాలిటీ టిడిపి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి చెన్నుబోయిన చిట్టిబాబు, మున్సిపాలిటీ అధ్యక్షుడు చుట్టుకుదురు శ్రీనివాస్, కౌన్సిలర్లు ధరణికోట విజయలక్ష్మి, గోపాలరావు, మైలా సైదులు, కొత్తపల్లి ప్రకాష్, హైదర్,దాసు,దిలిప్, ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.