BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

వసతి గృహంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

తెలంగాణ
12 Feb, 2026 - 11:47 PM
195 వీక్షణలు
బాలికల వసతి గృహంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ NTODAY NEWS:  పుంగనూరు ప్రతినిధి రాఘవేంద్ర రాజు  పుంగనూరు: పుంగనూరులోని సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ గురువారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి గృహంలో నివసిస్తూ చదువుకుంటున్న 9, 10వ తరగతి విద్యార్థినుల పాఠ్యపుస్తకాల పఠనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాలికల చదువుపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ముఖ్యంగా ఇంగ్లీష్, సైన్స్, గణిత శాస్త్రం వంటి విషయాలను విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే విధంగా బోధించాలని ఉపాధ్యాయులకు ఆదేశించారు. వసతి గృహ పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని, బాత్రూములను ఎప్పటికప్పుడు శుభ్రపరచాలని, నీటి సరఫరా నిరంతరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పరిశుభ్రమైన వాతావరణం విద్యార్థినుల ఆరోగ్యం మరియు విద్యాభ్యాసానికి కీలకమని పేర్కొన్నారు. వసతి గృహంలో అందిస్తున్న భోజన నాణ్యతను కూడా పరిశీలించి, మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని నిర్వాహకులకు ఆదేశించారు. విద్యార్థినులు అనారోగ్య సమస్యలకు గురికాకుండా తరచుగా ఏఎన్ఎంల ద్వారా కంటి పరీక్షలు మరియు ఇతర వైద్య పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సాంఘిక సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. #Punganur #SocialWelfareHostel #CollectorInspection #GirlsEducation #StudentWelfare #AndhraPradeshNews Follow us on Website Facebook Instagram YouTube