www.ntodaynews.com
మున్సిపాలిటీలో కారుణ్య నియామకాలు చేపట్టాలి
తెలంగాణ
కదిరి మున్సిపాలిటీలో కారుణ్య నియామకాలు చేపట్టాలి: సీఐటీయూ
NTODAY NEWS: కదిరి నియోజకవర్గం రిపోర్టర్: వినోద్ కుమార్
శ్రీసత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం పరిధిలోని కదిరి పట్టణ మున్సిపాలిటీలో మరణించిన మరియు పదవీ విరమణ చేసిన కార్మికుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు చేపట్టాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి జి.ఎల్. నరసింహులు డిమాండ్ చేశారు.
కదిరి మున్సిపాలిటీలో అనేక సంవత్సరాలుగా సుమారు 30 మంది కార్మికులకు సంబంధించిన కారుణ్య నియామకాలు పెండింగ్లో ఉన్నాయని ఆయన తెలిపారు. ఇప్పటికైనా తక్షణ చర్యలు తీసుకుని కారుణ్య నియామకాలు అమలు చేయాలని కోరుతూ మంగళవారం కదిరి మున్సిపల్ మేనేజర్ ఆరిఫుల్లాకు మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.
ప్రధాన డిమాండ్లు:
-మరణించిన కార్మికుల కుటుంబాల్లో ఒకరికి తప్పనిసరిగా ఉద్యోగం కల్పించాలి.
-స్పెషల్ గ్రేడ్ నుంచి సెలక్షన్ గ్రేడ్కు ఎంపికైన శానిటేషన్ కార్మికుల సంఖ్యను పెంచాలి.
-మున్సిపల్ కార్యాలయంలో పీఎఫ్ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కన్సల్టెంట్ను నియమించాలి.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ నాయకులు తిరుపాల్, జనార్ధన్, బాలకృష్ణ, లక్ష్మన్న, శ్రీనివాసులు, నరసింహమూర్తి, సీఐటీయూ పట్టణ కన్వీనర్ బాబ్జాన్, నాయకులు తాజుద్దీన్, ముస్తాక్ తదితరులు పాల్గొన్నారు.
#CompassionateAppointments
#KadiriMunicipality
#CITU
#MunicipalWorkers
#WorkersRights
#EmploymentJustice
#LabourIssues
#PublicSectorJobs
#NTodayNews
Follow us on
Website
Facebook
Instagram
YouTube