BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

మున్సిపాలిటీలో కారుణ్య నియామకాలు చేపట్టాలి

తెలంగాణ
20 Jan, 2026 - 03:22 AM
306 వీక్షణలు
కదిరి మున్సిపాలిటీలో కారుణ్య నియామకాలు చేపట్టాలి: సీఐటీయూ NTODAY NEWS: కదిరి నియోజకవర్గం రిపోర్టర్: వినోద్ కుమార్  శ్రీసత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం పరిధిలోని కదిరి పట్టణ మున్సిపాలిటీలో మరణించిన మరియు పదవీ విరమణ చేసిన కార్మికుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు చేపట్టాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి జి.ఎల్. నరసింహులు డిమాండ్ చేశారు. కదిరి మున్సిపాలిటీలో అనేక సంవత్సరాలుగా సుమారు 30 మంది కార్మికులకు సంబంధించిన కారుణ్య నియామకాలు పెండింగ్‌లో ఉన్నాయని ఆయన తెలిపారు. ఇప్పటికైనా తక్షణ చర్యలు తీసుకుని కారుణ్య నియామకాలు అమలు చేయాలని కోరుతూ మంగళవారం కదిరి మున్సిపల్ మేనేజర్ ఆరిఫుల్లాకు మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ప్రధాన డిమాండ్లు: -మరణించిన కార్మికుల కుటుంబాల్లో ఒకరికి తప్పనిసరిగా ఉద్యోగం కల్పించాలి. -స్పెషల్ గ్రేడ్ నుంచి సెలక్షన్ గ్రేడ్‌కు ఎంపికైన శానిటేషన్ కార్మికుల సంఖ్యను పెంచాలి. -మున్సిపల్ కార్యాలయంలో పీఎఫ్ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కన్సల్టెంట్‌ను నియమించాలి. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ నాయకులు తిరుపాల్, జనార్ధన్, బాలకృష్ణ, లక్ష్మన్న, శ్రీనివాసులు, నరసింహమూర్తి, సీఐటీయూ పట్టణ కన్వీనర్ బాబ్జాన్, నాయకులు తాజుద్దీన్, ముస్తాక్ తదితరులు పాల్గొన్నారు. #CompassionateAppointments #KadiriMunicipality #CITU #MunicipalWorkers #WorkersRights #EmploymentJustice #LabourIssues #PublicSectorJobs #NTodayNews Follow us on Website Facebook Instagram YouTube