www.ntodaynews.com
నాలా విస్తరణ పనులను పరిశీలించిన కార్పొరేటర్
తెలంగాణ
93 లక్షల వ్యయంతో వరద నాలా విస్తరణ పనులను కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి పరిశీలన..!!!
NTODAY NEWS: ఎల్బీనగర్
గడ్డిఅన్నారం డివిజన్ పరిధిలో పి&టీ కాలనీ ఎస్.జి.ఆర్ టవర్స్ నుండి న్యూ గడ్డిఅన్నారం వెంకటేశ్వర స్వామి దేవాలయం వరకు జరుగుతున్న వరద నాలా విస్తరణ పనులను సోమవారం ఉదయం గడ్డిఅన్నారం డివిజన్ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. న్యూ గడ్డిఅన్నారం మరియు పి&టీ కాలనీ ప్రాంతాల్లో చిన్నపాటి వర్షానికే వరద ముంపు సమస్య తీవ్రంగా ఎదురవుతున్నదని, ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు GHMC ద్వారా దశలవారీగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. గతంలో సుమారు 1 కోటి రూపాయలతో ప్రధాన వరద కాలువ నిర్మాణం పూర్తయింది.. ప్రస్తుతం ఆ ప్రాజెక్ట్కు అనుసంధానంగా 93 లక్షల రూపాయల వ్యయంతో జరుగుతున్న వరద నాలా విస్తరణ పనులు పూర్తయితే ఈ ప్రాంతాలకు పూర్తిస్థాయి నీరు నిల్వ మరియు ముంపు సమస్య తొలగిపోతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. పనులు నాణ్యతతో, ప్రమాణాలకు అనుగుణంగా, కాలపరిమితిలో పూర్తి చేయాలని స్పష్టంగా ఆదేశించారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకి సూచించారు. ఈ కార్యక్రమంలో GHMC అసిస్టెంట్ ఇంజనీర్ మల్లికార్జున్, వర్క్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు, స్థానిక నాయకులు, కాలనీ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube