డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాల్లో కబడ్డీ పోటీలు
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాల్లో కబడ్డీ పోటీలు: ఏలూరు జిల్లా టీములకు విజయాలు
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాల్లో భాగంగా గోదావరి జోన్ రాజమండ్రి గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీలో భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్రస్థాయిలో నిర్వహించిన కబడ్డీ క్రీడా పోటీలు నిజంగా అభినందనీయమైనవి. ఈ పోటీలు, ఏలూరు జిల్లా ఎస్సీ మోర్చా శ్రీకర్ బుర్రి ఆధ్వర్యంలో మంచి విజయాలు సాధించాయి. సీనియర్, జూనియర్ విభాగాల్లో రెండు టీములు బహుమతి గెలుచుకొని, కప్పును కూడా సాధించి, ఏలూరు జిల్లా భారతీయ జనతా పార్టీకి గౌరవం తెచ్చాయి.
పోలవరం అసెంబ్లీ కన్వీనర్ బుట్టాయిగూడెం కొండేటి రామకృష్ణ కి, అలాగే ఈ క్రీడాకారులందరికీ, వారిని ప్రోత్సహించిన వారందరికీ శుభాకాంక్షలు. ఇదే విధంగా యువతకు స్ఫూర్తిగా నిలిచే ఈ విజయాలు మరిన్ని క్రీడా పోటీలకు ప్రేరణగా నిలుస్తాయనీ ఆశిస్తున్నాను.