BREAKING
11,600 కి.మీ చెప్పులు లేకుండా నడిచిన నూతన దంపతులు.. 12 జ్యోతిర్లింగాల దర్శనం నక్కపల్లి మండలంలో అవినీతి ఆరోపణలు కంఠమహేశ్వర దేవాలయ హుండీలో చోరీ తిరుమలకు వెళ్లే భక్తులకు శుభవార్త చిట్యాలలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు ఘన స్వాగతం ఉచిత యోగా శిక్షణ శిబిరానికి శ్రీకారం ఇంధన ధరలు తగ్గించాలి.. తిరువూరులో సీపీఐ ధర్నా మెగా ఫ్యామిలీ వీరాభిమాని ధారకొండ వెంకటరమణ (47) ఇకలేరు.. నకిరేకల్‌లో ఘనంగా మారథాన్ ర్యాలీ చెప్పులు లేకుండా 11,600 కిలోమీటర్ల పాదయాత్ర 11,600 కి.మీ చెప్పులు లేకుండా నడిచిన నూతన దంపతులు.. 12 జ్యోతిర్లింగాల దర్శనం నక్కపల్లి మండలంలో అవినీతి ఆరోపణలు కంఠమహేశ్వర దేవాలయ హుండీలో చోరీ తిరుమలకు వెళ్లే భక్తులకు శుభవార్త చిట్యాలలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు ఘన స్వాగతం ఉచిత యోగా శిక్షణ శిబిరానికి శ్రీకారం ఇంధన ధరలు తగ్గించాలి.. తిరువూరులో సీపీఐ ధర్నా మెగా ఫ్యామిలీ వీరాభిమాని ధారకొండ వెంకటరమణ (47) ఇకలేరు.. నకిరేకల్‌లో ఘనంగా మారథాన్ ర్యాలీ చెప్పులు లేకుండా 11,600 కిలోమీటర్ల పాదయాత్ర
www.ntodaynews.com

కంఠమహేశ్వర దేవాలయ హుండీలో చోరీ

తెలంగాణ
/ సూర్యాపేట
Reporter
కూనురు మధు నల్గొండ జిల్లా ప్రతినిధి
18 May, 2026 - 01:20 PM
48 వీక్షణలు

చిలుకూరు మండలంలోని జెర్రిపోతులగూడెంలో ఆదివారం రాత్రి చోరీ జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గుర్తు తెలియని వ్యక్తులు గ్రామంలో గౌడ సామాజిక వర్గీయుల ఆరాధ్య దైవమైన కంఠమహేశ్వర స్వామి దేవాలయం తాళాలు పగులగొట్టి హుండీలోని  నగదు చోరీ చేశారు. సుమారు రూ.10 వేలు దోచుకున్నట్లుగా గ్రామస్థులు తెలిపారు. గతంలో కూడా ఈ దేవాలయంలో చోరీ జరిగింది. ఆదివారం రాత్రి ఈ హుండీతో పాటు పక్కనే ఉన్న కనకదుర్గ దేవాలయంలో కూడా దుండగులు చోరీకి ప్రయత్నించారని స్థానికులు తెలిపారు. గతంలో చిలుకూరు కాల్వ ఒడ్డు అభయాంజనేయ స్వామి, బస్టాండ్ సమీపంలోని ఆంజనేయస్వామి దేవాలయాల్లో కూడా ఇలాంటి చోరీలు జరిగాయి. దేవాలయ చోరీలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కంఠమహేశ్వర స్వామి దేవాలయ కమిటీ ఛైర్మన్ సురగాని వెంకటేశ్వర్లు, గ్రామస్థులు కోరుతున్నారు.