BREAKING
చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు పేపర్ ప్లేట్ల వాడకంని నిషేధించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు పేపర్ ప్లేట్ల వాడకంని నిషేధించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్.
www.ntodaynews.com

కంఠమహేశ్వర దేవాలయ హుండీలో చోరీ

తెలంగాణ
/ సూర్యాపేట
18 May, 2026 - 01:20 PM
179 వీక్షణలు

చిలుకూరు మండలంలోని జెర్రిపోతులగూడెంలో ఆదివారం రాత్రి చోరీ జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గుర్తు తెలియని వ్యక్తులు గ్రామంలో గౌడ సామాజిక వర్గీయుల ఆరాధ్య దైవమైన కంఠమహేశ్వర స్వామి దేవాలయం తాళాలు పగులగొట్టి హుండీలోని  నగదు చోరీ చేశారు. సుమారు రూ.10 వేలు దోచుకున్నట్లుగా గ్రామస్థులు తెలిపారు. గతంలో కూడా ఈ దేవాలయంలో చోరీ జరిగింది. ఆదివారం రాత్రి ఈ హుండీతో పాటు పక్కనే ఉన్న కనకదుర్గ దేవాలయంలో కూడా దుండగులు చోరీకి ప్రయత్నించారని స్థానికులు తెలిపారు. గతంలో చిలుకూరు కాల్వ ఒడ్డు అభయాంజనేయ స్వామి, బస్టాండ్ సమీపంలోని ఆంజనేయస్వామి దేవాలయాల్లో కూడా ఇలాంటి చోరీలు జరిగాయి. దేవాలయ చోరీలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కంఠమహేశ్వర స్వామి దేవాలయ కమిటీ ఛైర్మన్ సురగాని వెంకటేశ్వర్లు, గ్రామస్థులు కోరుతున్నారు.